Asianet News TeluguAsianet News Telugu

అజిత్ - విజయ్ ఫ్యాన్స్ మధ్య మొదలైన యుద్ధం, థియేటర్ కోసం తన్నుకున్న తమిళ తంబీలు

ఏ ఫిల్మ్ ఇండస్ట్రీలోఅయినా స్టార్ హీరోల ఫ్యాన్స్ మధ్య వార్ కామన్. తెలుగులో అయినా  తమిళ్ లో అయిన ఉన్నదే. కాని కోలీవుడ్ లో అజిత్ , విజయ్ ఫ్యాన్స్ మధ్య వార్ మాత్రం ఓ యుద్థ వాతావరణాన్నే క్రియేట్ చేస్తుంది. 

Ajith and Vijay Fans War In Pongal Release
Author
First Published Jan 10, 2023, 7:36 PM IST


తమిళనాట ఫ్యాన్స్ యుద్దం స్టార్ట్ అయ్యింది. కోలీవుడ్ లో స్టార్ ఇమేజ్ తో పాటు.. ఫ్యాన్ ఫాలో, యింగ్ కూడా భారీ స్థాయిలో సమానంగా కలిగి ఉన్న హీరోలు విజయ్ - అజిత్. వీరిద్దరు తమిళ నాట పవర్ ఫుల్ ఇమేజ్ తో దూసుకుపోతున్నారు. వీరి ఫ్యాన్స్ మాత్రం సోషల్ మీడియా వార్ తో పాటు...అప్పుడప్పుడు బయట కూడాకొట్టుకు చస్తుంటారు. ఇక వీరిద్దరి సినిమాలు ఒకేసారి రిలీజ్ అయ్యాయంటే.. ఇక రచ్చ రచ్చే. ఈ సంఘనల అరుదుగా జరిగేది. ఈక్రమంలో అలాంటి అరుదైన సందర్భం ఈసంక్రాంతికిరాబోతోంది. పొంగల్ వార్ లో విజయ్ ‌, అజిత్ సినిమాలు పోటీపడబోతున్నాయి. 

తమిళ నాట ఇద్దరికీ సమానంగా క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ ఉంది. ఇక ఈ హీరోల  సినిమాలు రిలీజ్ అయితే అభిమానుల మధ్య యుద్ధ వాతావరణం నెలకొని ఉంటుంది. సినిమాల రిలీజ్ అప్పుడు వాళ్లు చేసే రచ్చ మామూలుగా ఉండదు. ఇక సాధారణ పరిస్థితుల్లో కూడా ప్రతిరోజూ సోషల్ మీడియాలో వీళ్ల మధ్య దారణమైన మాటల యుద్ధాలు జరుగుతుంటాయి.  ఈక్రమంలోనే ఈనెల సంక్రాంతి కానుకగా అజిత్ సినిమా తునివు.. తెలుగులో తెగింపు తో పాటు విజయ్ వారీసు తెలుగులో వారసుడు రిలీజ్ కాబోతున్నాయి. 

రిలీజ్ కు ముందే ఈ ఇద్దరు హీరోల ఫ్యాన్స్ మధ్య విబేధాలు స్టార్ట్ అయ్యాయి. దాదాపు 9 సంవత్సరాల తర్వాత ఈ స్టార్ హీరోల సినిమాలు పోటీపడబోతున్నాయి.  తమిళనాట అసలు తంటా  థియేటర్ల యజమానులకు వచ్చింది.  సర్దుబాటు చెయ్యలేక నానా అవస్థలు పడుతున్నారు అక్కడి వారు. దాదాపు మల్టీప్లెక్సులు, సింగిల్ స్క్రీన్స్ అన్నీ కూడా ఈ రెండు సినిమాలతోనే నిండిపోయాయి. 

ఇక పూల దండలు, పాలాభిషేకాలు.. కటౌట్లు, బ్యానర్లతో ఫ్యాన్స్ రెడీగా ఉన్నారు. ఈక్రమంలో ఓ మల్టీప్లెక్సులో స్క్రీన్స్ కేటాయించే విషయంలో అజిత్ – విజయ్ ఫ్యాన్స్ మధ్య గొడవ జరిగింది. ఆ థియేటర్ లో మొత్తం మూడు స్క్రీన్స్ ఉండగా.. మొదటి స్క్రీన్ అజిత్ సినిమాకు.. రెండోవ స్క్రీన్ విజయ్ సినిమాకు కేటాయించారు. మూడో స్క్రీన్ మా హీరోకి ఇవ్వాలంటే మా హీరోకి ఇవ్వాలంటూ ఫ్యాన్స్ గోడవ స్టార్ట్ చేశారు. దాంతో థియేటర్ ఓనర్స్ రంగంలోకి దిగారు. ఫ్యాన్స్ కు షాక్ ఇచ్చారు.టాస్ వేసి స్క్రీన్ సెలెక్ట్ చేసింది. అజిత్ ఫ్యాన్స్ టాస్ గెలవడంతో తునివు కే మూడో థియేటర్ కూడా ఇచ్చేశారు. 

Follow Us:
Download App:
  • android
  • ios