Asianet News TeluguAsianet News Telugu

వాళ్ళ వివాహమే చెల్లదు: ముస్తఫా రాజ్ మొదటి భార్యకు ప్రియమణి కౌంటర్

బాలీవుడ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రియమణి ఇలా స్పందించారు. ముస్తఫాతో వివాహ బంధం పట్ల నేను పూర్తి విశ్వాసంతో ఉన్నాను. ముస్తఫా అమెరికాలో ఉన్నప్పటికీ మేము ప్రతిరోజూ మాట్లాడుకుంటూ ఉంటాము అన్నారు. 


 

after mustafa first wife ayesha allegations this is how priyamani reacted ksr
Author
Hyderabad, First Published Jul 23, 2021, 1:32 PM IST

ముస్తఫా రాజ్ మొదటి భార్య అయేషా కామెంట్స్ నేపథ్యంలో ప్రియమణి స్పందించారు. భర్త ముస్తఫాతో తన రిలేషన్ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. బాలీవుడ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రియమణి ఇలా స్పందించారు. ముస్తఫాతో వివాహ బంధం పట్ల నేను పూర్తి విశ్వాసంతో ఉన్నాను. ముస్తఫా అమెరికాలో ఉన్నప్పటికీ మేము ప్రతిరోజూ మాట్లాడుకుంటూ ఉంటాము అన్నారు. 


అమెరికా, ఇండియా రెండు భిన్నమైన టైం జోన్స్ కలిగి ఉన్నాయి. అయినప్పటికీ ఏదో ఒక సమయంలో ముస్తఫా నేను మాట్లాడుకుంటాము. నేను బిజీగా ఉన్నప్పుడు ఆయన జస్ట్ టెక్స్ట్ మెస్సేజ్, వాయిస్ మెస్సేజ్ పంపిస్తారు. అదే విధంగా ఆయన బిజీగా ఉన్నప్పుడు నేను కూడా అదే చేస్తాను. ప్రొఫెషన్ కోసం అమెరికా వెళ్లిన ముస్తఫా ఎప్పుడూ నాతో టచ్ లోనే ఉంటారని ప్రియమణి తెలియజేశారు. 


ఇక ఇటీవల ముస్తఫా మొదటి భార్య అయేషా.. ప్రియమణితో ఆయన వివాహం చెల్లదని సంచలన వ్యాఖ్యలు చేశారు. మేమిద్దరం చట్టబద్ధంగా విడిపోలేదని, కనీసం విడాకులకు కూడా అప్లై చేయలేదని అన్నారు. ముస్తఫా పై తాను చాలా కాలంగా న్యాయపోరాటం చేస్తున్నట్లు వెల్లడించారు. అయేషా ఆరోపణలకు స్పందించిన ముస్తఫా 2013లో విడాకులు తీసుకొని విడిపోయినట్లు, ఇద్దరు పిల్లల సంరక్షణ కోసం డబ్బులు పంపుతున్నట్లు వెల్లడించారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios