Asianet News TeluguAsianet News Telugu

నటి హిమజా, సింగర్‌ సాకేత్‌.. మేము సైతం అంటూ గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌

రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్ గారు సమాజంలో ప్రతి ఒక్కరికి ఉపయోగపడే విధంగా పచ్చదనం పెంచడం కోసం ఈ మొక్కలు నాటే కార్యక్రమం తీసుకున్నారంటున్నారు సెలబ్రిటీలు. ఇంత మంచి కార్యక్రమం చేపట్టిన సంతోష్ కు వారు కృతజ్ఞతలు తెలిపారు.

Actress Himaja and Singer Saketh Takes The Greenindia Challenge
Author
Hyderabad, First Published Jun 27, 2020, 6:02 PM IST

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా యాంకర్ శివ జ్యోతి ఇచ్చిన ఛాలెంజ్ ను స్వీకరించి శనివారం జూబ్లీహిల్స్‌లోని మొక్కలు నాటిన ప్రముఖ నటి, యాంకర్ హిమజ. ఈ సందర్భంగా హిమజ మాట్లాడుతూ... రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్ గారు సమాజంలో ప్రతి ఒక్కరికి ఉపయోగపడే విధంగా పచ్చదనం పెంచడం కోసం ఈ మొక్కలు నాటే కార్యక్రమం తీసుకున్నారని ఇంత మంచి కార్యక్రమం చేపట్టిన సంతోష్ గారికి కృతజ్ఞతలు తెలిపారు.

నాకు కూడా మొక్కలు అంటే చాలా ఇష్టమని నేను సమయం దొరికినప్పుడల్లా మొక్కలు నాటుత. ఈ రోజు నేను ఇక్కడ మూడు మొక్కలు నాటడం జరిగింది అని నాటిన మొక్కల కు మూడు పేర్లు పెట్టుకుంటున్నాను రాముడు, సీత, లక్ష్మణుడు వీరు ఎప్పుడూ కలిసి మెలిసి ఉంటారు కాబట్టి ఈ మొక్కలు కూడా అదే విధంగా కలిసి పెరగాలని కోరుకుంటూన్న అని తెలిపింది. తాను నందిత రాయి, ప్రణవి మానుకొండ, భాను ను ఛాలెంజ్‌ చేసింది హిమజా.

సింగర్‌ సాకేత్‌ కూడా గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ లో పాల్గొన్నారు. శనివారం మొక్కలు నాటిన సాకేత్‌.. దినకర్ , పర్ణిక , యాక్టర్ & సింగర్ కౌముది లను చాలెంజ్‌ చేశాడు. ఈ కార్యక్రమంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కో ఫౌండర్ రాఘవ , ప్రతినిధి కిషోర్ గౌడ్  పాల్గొన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios