నిద్రమాత్రలు మింగి స్టార్ హీరోయిన్ ఆత్మహత్యాయత్నం! కానీ..
తెలుగులో మహాత్మ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యింది భావన. ఆ తర్వాత నితిన్ సరసన హీరో సినిమా చేసింది. తెలుగులో పెద్దగా ఆఫర్స్ రాని ఆమె చేసిన రెండు మూడు సినిమాల ద్వారానే ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. గుర్తుండిపోయే ఇమేజ్ సొంతం చేసుకుంది.
మహాత్మ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యింది భావన. ఆ తర్వాత నితిన్ సరసన హీరో సినిమా చేసింది. తెలుగులో పెద్దగా ఆఫర్స్ రాని ఆమె చేసిన రెండు మూడు సినిమాల ద్వారానే ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. గుర్తుండిపోయే ఇమేజ్ సొంతం చేసుకుంది. ఆమె తాజాగా ఆత్మహత్యకు యత్నించింది. 2017 నాటి నటిపై వేధింపుల కేసును పోలీసులు తిరిగి విచారిస్తుండడంతో భయపడిన ఆమె అధిక మోతాదులో నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యకు యత్నించినట్టు ప్రచారం జరిగింది. తీవ్ర అస్వస్థతతో ఆమె కొచ్చి ఆసుపత్రిలో చేరడం ఈ వార్తలకు మరింత బలం చేకూర్చింది. ఆమె ప్రాణాపాయం నుంచి బయటపడినట్టు వైద్యులు తెలిపారు.
అయితే, ఈ వార్తలను భామ కొట్టిపడేసింది. పొరపాటున అధిక మోతాదులో నిద్రమాత్రలు తీసుకోవడం వల్లే ఆసుపత్రిలో చేరాల్సి వచ్చిందని పేర్కొంది. తాను ఆత్మహత్యకు యత్నించినట్టు వస్తున్న వార్తల్లో ఎంతమాత్రమూ నిజం లేదని, ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని భామ ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పేర్కొంది. తాను పూర్తి ఆరోగ్యంగా ఉన్నానని తెలిపింది. తనపై చూపిస్తున్న ప్రేమాభిమానాలకు ధన్యవాదాలని పేర్కొంది.
ఇక భావనపై లైంగిక వేధింపుల కేసు మరోసారి తెరపైకి వచ్చింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నమలయాళ సూపర్స్టార్ దిలీప్ కుమార్పై కేరళ పోలీసులు నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేశారు. 2017 ఫిబ్రవరి 17న షూటింగ్ ముగించుకొని ఇంటికి వెళ్తున్న సమయంలో హీరోయిన్ భావనను కిడ్నాప్ చేసి లైంగిక వేధింపులకు గురి చేయడం అప్పట్లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.
మలయాళం చిత్రపరిశ్రమలో భామ ప్రముఖ నటిగా పేరు తెచ్చుకుంది. లోహితదాస్ దర్శకత్వం వహించిన నైవేద్యం సినిమాతో చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టింది. ఆ తర్వాత పలు దక్షిణాది చిత్రాల్లోనూ నటించింది. జనవరి 2020 లో వ్యాపారవేత్త అరుణ్ను పెళ్లి చేసుకుని సినిమాలకు బ్రేక్ చెప్పింది.