ఆచార్య దెబ్బతో దర్శకుడు కొరటాల శివ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఆయన ఈ మధ్య ఓ ప్రాపర్టీ కూడా అమ్మేశారట. ప్రస్తుతం ఈ న్యూస్ పరిశ్రమలో హాట్ టాపిక్ గా ఉంది.
రైటర్ గా పరిశ్రమలో అడుగు పెట్టిన కొరటాల శివ (Koratala Shiva)అనేక హిట్ చిత్రాలకు పని చేశారు. 2013లో విడుదలైన మిర్చి మూవీతో దర్శకుడిగా మారారు. మిర్చి బ్లాక్ బస్టర్ హిట్ కాగా... రెండో చిత్రం శ్రీమంతుడు ఇండస్ట్రీ హిట్ అందుకుంది. దీంతో కొరటాల స్టార్ డైరెక్టర్స్ లిస్ట్ లో చేరారు. ఎన్టీఆర్ తో చేసిన జనతా గ్యారేజ్, మహేష్ తో చేసిన రెండో చిత్రం భరత్ అనే నేను వరుస విజయాలు అందుకున్నాయి. ఓటమి లేని సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా కొరటాల రికార్డులకు ఎక్కాడు. అయితే ఆచార్యతో ఆయన ఫేమ్ మొత్తం మోయింది.
ఆచార్య(Acharya) భారీ డిజాస్టర్ గా నిలిచింది. చిరంజీవి-రామ్ చరణ్(Ram Charan) ల మల్టీస్టారర్ గా తెరకెక్కిన ఆచార్య రెండో రోజే థియేటర్స్ నుండి వెళ్లిపోయే పరిస్థితి. అంత దారుణమైన ఫలితాన్ని ఆచార్య చవిచూసింది. కనీసం 50 శాతం రికవరీ కూడా సాధించలేదు. దీనితో బయ్యర్లకు నిర్మాతలు నష్టాల్లో కొంత భాగం తిరిగి చెల్లించారు. కాగా ఈ మూవీ కారణంగా కొరటాల ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు సమాచారం. కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ ఆచార్య చిత్రాన్ని నిర్మించాయి.
కాగా మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకుందట. ఆలస్యం కావడంతో మేకర్స్ మధ్యలో వదిలి వెళ్ళిపోయారట. దీంతో కొరటాల నిర్మాణ బాగస్వామిగా ఉంది ఆచార్య తెరకెక్కించారట. అట్టర్ ప్లాప్ కారణంగా భారీగా నష్టాలు వచ్చాయి. బయ్యర్లకు తిరిగి చెల్లించాల్సిన మొత్తం కోసం కొరటాల ఓ ప్రాపర్టీ అమ్మేశారట. రూ. 15 కోట్లు చెల్లించాల్సి ఉండగా... కొరటాల ఈ చర్యకు పాల్పడ్డారన్న వార్త టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా ఉంది. దీనితో ఆచార్య ఫెయిల్యూర్ బాధ్యత కొరటాల తీసుకున్నట్లు అయ్యింది.
