దక్షిణ భారత సినీ పరిశ్రమకు చెందిన స్టార్ హీరో అల్లు అర్జున్ తాజాగా ముంబైలో బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్‌ను గుప్తంగా కలవడం సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. 

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కి పుష్ప 2 తర్వాత పాన్ ఇండియా స్థాయిలో తిరుగులేని క్రేజ్ ఏర్పడింది. బన్నీ నటించబోతున్న తదుపరి చిత్రాలు కూడా ఆసక్తిని పెంచేస్తున్నాయి. అల్లు అర్జున్ తాజాగా ముంబైలో బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్‌ను గుప్తంగా కలవడం సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఆమిర్ నివాసంలో జరిగిన ఈ సమావేశం తర్వాత ఇద్దరూ కలిసి తీసుకున్న ఒక ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో, పాన్-ఇండియా స్థాయిలో కొత్త ప్రాజెక్ట్‌పై ఊహాగానాలు తెరపైకి వచ్చాయి.

అల్లు అర్జున్, ఆమిర్ ఖాన్‌ల మధ్య 2023లో ఒక వివాహ వేడుకలో స్నేహపూర్వకంగా సంభాషించిన దృశ్యాలు అప్పట్లోనే వైరల్ అయ్యాయి. తాజాగా మళ్లీ భేటీ కావడంతో వీరిద్దరి కాంబినేషన్ గురించి రూమర్స్ మొదలయ్యాయి. వీళ్లిద్దరి కాంబినేషన్ పై అధికారిక ప్రకటనలు ఏవీ రాకపోయినా, ఇండస్ట్రీలోని వర్గాలు ఈ పరిణామాలపై నిశితంగా గమనిస్తున్నాయని సమాచారం.

ఆమిర్ ఖాన్ ప్రస్తుతం తన రాబోయే చిత్రం సితారే జమీన్ పర్ పై దృష్టి సారించి ఉన్నారు. అంతేగాక, ఆయన భారీ బడ్జెట్‌తో రూపొందించబోతున్న మహాభారతం ఆధారిత చిత్రానికి సంబంధించి కూడా పరిశ్రమలో ఆసక్తికరమైన చర్చలు జరుగుతున్నాయి. "పాత్రలకు సరిపోయే నటులను ఎంపిక చేయడం కోసం చూస్తున్నా" అని ఇటీవల ఆమిర్ వ్యాఖ్యానించారు.అయితే వీళ్లిద్దరి భేటీ మహాభారతం కోసమా అనే ప్రచారం కూడా లేకపోలేదు. 

 

Scroll to load tweet…

ప్రస్తుతం అల్లు అర్జున్ తన తదుపరి చిత్రం AA22 కోసం దర్శకుడు అట్లీతో కలిసి పనిచేస్తున్నారు. ఈ చిత్రం ఒక సై-ఫై యాక్షన్ ఎంటర్టైనర్‌గా రూపొందుతున్నదనీ, హాలీవుడ్ స్థాయి విజువల్ ఎఫెక్ట్స్ అందించనున్నదనీ సమాచారం. పుష్ప 3 కూడా ఆల్రెడీ ప్రీ-ప్రొడక్షన్ దశలో ఉండగా, AA22 పూర్తైన తర్వాత షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఈ నేపథ్యంలో, ఆమిర్ ఖాన్ – అల్లు అర్జున్ కలయిక బాలీవుడ్, టాలీవుడ్ ప్రేక్షకులకు పండగ చేసుకునేలా ఒక భారీ పాన్ ఇండియా కాంబినేషన్‌గా మారే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతానికి అధికారిక సమాచారం లేకపోయినా, ఫిల్మ్ ఇండస్ట్రీ ఈ కాంబినేషన్‌ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తోంది. అమీర్ ఖాన్, అల్లు అర్జున్ కలుసుకున్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.