Asianet News TeluguAsianet News Telugu

Prabhas:ప్రభాస్ స్దాయికి అది 'జుజుబీ'నే కానీ...ఏదో తేడా కొడుతోందే

సలార్, ఆదిపురుష్, ప్రాజెక్ట్ కె, స్పిరిట్ లాంటి సినిమాలతో ప్రభాస్ నెక్ట్స్ రెండేళ్లు పైగానే బిజీగా ఉంటారనే విషయం స్పష్టం అవుతుంది. అలాగే ఈ సినిమాలన్నీ భారీ బడ్జెట్ చిత్రాలుగా తెరకెక్కడంతో చాలా టైమ్ పడుతుంది.

 

50 crores transferred from RRR producer to Prabhas account?
Author
Hyderabad, First Published Jan 26, 2022, 8:56 AM IST

 

టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ నుండి పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన హీరో ప్రభాస్. బాహుబలి తర్వాత ఆయన ఇమేజే మారిపోయింది. ఆయన ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా ఉన్నారు. పాన్ ఇండియా సినిమాలతో నటిస్తూ.. వరల్డ్ వైడ్ గా అభిమానులకు చేరువయ్యారు. లేటెస్ట్ సమాచారం ప్రకారం ఇప్పుడు చేస్తున్న   వరుస సినిమాలతో పాటు మరో మూడు సినిమాలను కూడా ప్రభాస్ లైన్ లో పెట్టినట్లు  మీడియాలో ఓ వార్త తెగ హల్ చల్ అవుతుంది. దీంతో ప్రభాస్ డై హార్డ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు.

ఇది ప్రక్కన పెడితే...తాజాగా టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ప్రముఖ ప్రొడ్యూసర్ గా ఎదిగిన డీవీవీ దానయ్య, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో ఓ మూవీ చేయాలని నిర్ణయించుకున్నారట. అందుకే ప్రభాస్ కు దాదాపుగా 50 కోట్లు అడ్వాన్స్ ఇచ్చి మరీ ఆయనతో మూవీ చేయాలని లాక్ చేసినట్లు తెలుస్తుంది. ఈ మేరకు ఓ న్యూస్ వినిపిస్తోంది.

గత రెండు రోజులుగా ప్రభాస్ కు యాభై కోట్ల అడ్వాన్స్ ఇచ్చారనే వార్త మీడియాలో హల్ చల్ చేస్తోంది. అందులో పెద్ద విశేషం లేదు..వింత అంతకన్నా లేదు. ప్రభాస్ స్దాయికి అది జూజుబి. అయితే డైరక్టర్ ఎవరు అనేది ఫైనల్ కాలేదు. మారుతి అంటూ ఓ వర్గం హడావిడి చేస్తోంది. మారుతి మాకొద్దు అంటూ ఫ్యాన్స్ గోలెత్తిపోతున్నారు. సలార్, ఆదిపురుష్, ప్రాజెక్ట్ కె, స్పిరిట్ లాంటి సినిమాలతో ప్రభాస్ నెక్ట్స్ రెండేళ్లు పైగానే బిజీగా ఉంటారనే విషయం స్పష్టం అవుతుంది. అలాగే ఈ సినిమాలన్నీ భారీ బడ్జెట్ చిత్రాలుగా తెరకెక్కడంతో చాలా టైమ్ పడుతుంది.

అయితే మరి డైరక్టర్ ఎవరు అనేది తేలకుండా...ఎప్పుడు చేస్తారో కన్ఫర్మేషన్ లేకుండా అడ్వాన్స్ యాభై కోట్లు ఇస్తారా అని సందేహం వ్యక్తం చేస్తున్నారు సినీ జనం.  ఈ లాజిక్ ..లాజిక్ గానే ఉంది.సాధారణంగా అడ్వాన్స్ పెద్ద స్టార్ అయితే పది కోట్లు దాకా ఇస్తారు అంటున్నారు. అయితే ఇక్కడే ఓ విషయం...డైరక్టర్ పేరు బయిటకు రాలేదు కానీ ఆల్రెడీ కథ చెప్పి లాక్ అయ్యిపోయేడేమో అని కొందరి డౌట్. ఏమౌ..అఫీషియల్ ఎనౌన్సమెంట్ వస్తే కానీ ఇలాంటి వార్తలు నమ్మలేం అంటున్నారు యాంటీ ఫ్యాన్స్.

ఇదిలా ఉంటే...రాధేశ్యామ్ సినిమా రిలీజ్ వాయిదా పడగా త్వరలోనే ఈ సినిమాను రిలీజ్ చేస్తామని నిర్మాతలు తెలిపారు. ఈ సినిమాలో ప్రభాస్ ఓ విలక్షణమైన పాత్రలో నటిస్తున్నారు. ప్రేరణ పాత్రలో పూజా హెగ్దే నటిస్తున్నారు. పీరియాడికల్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి.

Follow Us:
Download App:
  • android
  • ios