బెల్లంకొండ ప్లాఫ్ సినిమా... తమిళంలోకి రీమేక్!
తమిళంలో రాక్షసుడు చిత్రంలో హీరోగా నటించిన విష్ణు విశాల్ ఈ రీమేక్ లో చేయబోతున్నారు. ఇదీ పోలీస్ పాత్ర కావటంతో విష్ణు విశాల్ వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. తమిళం కోసం కొన్ని మార్పులు చేయబోతున్నట్లు తెలుస్తోంది.
బెల్లంకొండ శ్రీనివాస్, కాజల్ అగర్వాల్, మెహరీన్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘కవచం’.గతేడాది తెలుగులో డిసెంబర్ 7న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ప్లాఫ్ టాక్ అందుకుంది. శ్రీనివాస్ మామిళ్ల ‘కవచం’కు దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఇప్పుడు తమిళంలోకి రీమేక్ చేస్తున్నారు. తమిళంలో రాక్షసుడు చిత్రంలో హీరోగా నటించిన విష్ణు విశాల్ ఈ రీమేక్ లో చేయబోతున్నారు. ఇదీ పోలీస్ పాత్ర కావటంతో విష్ణు విశాల్ వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. తమిళం కోసం కొన్ని మార్పులు చేయబోతున్నట్లు తెలుస్తోంది.
అయితే తమిళంలో చేయటానికి కారణం ఉందని తెలుస్తోంది. తెలుగులో ఈ సినిమా డిజాస్టర్ అయ్యింది కానీ హిందీ ప్రేక్షకులు ఈ చిత్రాన్ని బాగా ఆదరించారు. అక్కడ సినిమా రికార్డు సృష్టించింది. హిందీలో ఈ చిత్రం ‘ఇన్స్పెక్టర్ విజయ్’ టైటిల్తో విడుదలైంది. కేవలం ఇరవై నాలుగు గంటల్లో యూట్యూబ్లో ఈ చిత్రాన్ని కోటి 60 లక్షల మంది చూసారు. ఆ రికార్డ్ చూసిన విష్ణు విశాల్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్తున్నారు.
ఒక మంచి థ్రిల్లర్ సినిమాకి కావల్సినంత విషయం ఉన్న కథే ఇది. కానీ ఆ కథని పకడ్బందీగా చెప్పడంలో దర్శకుడి అనుభవం సరిపోలేదు. ప్రారంభ సన్నివేశాలు మామూలుగానే అనిపించినా... ఇంట్రవెల్ సమయం నుంచి అసలు కథ మొదలవుతుంది. ఊహించని కొన్ని ట్విస్ట్ లు ఆసక్తిని రేకెత్తిస్తాయి. కానీ ఆ ఇంట్రస్ట్ థ్రిల్ని పంచే స్థాయిలో మాత్రం లేదు. దాంతో సినిమా ఓ సాధారణ పోలీసు సినిమాగా మారిపోయింది. దాంతో ఈ సినిమా స్క్రీన్ ప్లేలో మార్పులు చేసి తమిళంలో చేయబోతున్నట్లు సమాచారం.