యాంకర్ రవికి బిగ్ బాస్ శ్యామల ఛాలెంజ్!
టాలీవుడ్ లో ఉన్న పాపులర్ ఫీమేల్ యాంకర్స్ లో శ్యామల ఒకరు. బుల్లితెరపై, టాలీవుడ్ లో శ్యామల పలు కార్యక్రమాల్లో కనిపిస్తున్న సంగతి తెలిసిందే. గత ఏడాది బిగ్ బాస్ సీజన్ 2లో కూడా శ్యామల కంటెస్టెంట్ గా పాల్గొంది.
టాలీవుడ్ లో ఉన్న పాపులర్ ఫీమేల్ యాంకర్స్ లో శ్యామల ఒకరు. బుల్లితెరపై, టాలీవుడ్ లో శ్యామల పలు కార్యక్రమాల్లో కనిపిస్తున్న సంగతి తెలిసిందే. గత ఏడాది బిగ్ బాస్ సీజన్ 2లో కూడా శ్యామల కంటెస్టెంట్ గా పాల్గొంది. శ్యామల తాజాగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటింది.
టిఆర్ఎస్ ఎంపీ సంతోష్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి టాలీవుడ్ సెలెబ్రిటీల నుంచి విశేష స్పందన వస్తోంది. టాలీవుడ్ సినీ ప్రముఖులంతా ఒక్కొక్కరుగా మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొంటున్నారు. తాజాగా యాంకర్ శ్యామల మొక్కలు నాటి ఆ దృశ్యాలని సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంది.
ప్రతిఒక్క సెలెబ్రిటీ మొక్కలు నాటిన తర్వాత మరో ముగ్గురిని నామినేట్ చేస్తున్నారు. శ్యామల కూడా మరో ముగ్గురిని నామినేట్ చేసింది. యాంకర్ రవి, ఝాన్సీ, వర్షిణి లని శ్యామల నామినేట్ చేయడం విశేషం. ఇప్పటివరకు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పరుచూరి గోపాల కృష్ణ, శ్రీకాంత్, గిరిబాబు, బ్రహ్మానందం, సూపర్ స్టార్ కృష్ణ లాంటి ప్రముఖులంతా పాల్గొన్నారు.
శ్యామల మొక్కలు నాటుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. శ్యామల యాంకరింగ్ చేస్తూనే పలు చిత్రాల్లో నటించింది కూడా. గత ఏడాది బిగ్ బాస్ సీజన్ 2లో పాల్గొంది. మొదట షో నుంచి ఎలిమినేట్ అయినా మరోసారి వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా హౌస్ లోకి ప్రవేశించింది.