'టిల్లు స్క్వేర్' డైరక్టర్ నెక్ట్స్ ప్రాజెక్టు డిటేల్స్..ఇంట్రస్టింగ్
‘టిల్లు స్క్వేర్’కు రోజురోజుకీ పాజిటివ్ టాక్తో పాటు కలెక్షన్స్ కూడా ఓ రేంజిలో వస్తున్నాయి. కలెక్షన్స్ చూస్తుంటే మూడురోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించేలా ఉందని ట్రేడ్ అంటోంది.
ఒక సినిమా హిట్ అయితే ఆ డైరక్టర్, హీరో అందరూ ఫుల్ బిజీ అయ్యిపోతారు. అందరు నిర్మాతలు ఈ టీమ్ చుట్టూ ప్రదిక్షణలు చేస్తూంటారు. ఆ క్రమంలోనే ఇప్పుడు ‘టిల్లు స్క్వేర్’డైరక్టర్, హీరో, టీమ్ వీళ్లకు ఫుల్ క్రేజ్ క్రియేట్ అయ్యింది. సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన ‘టిల్లు స్క్వేర్’కు రోజురోజుకీ పాజిటివ్ టాక్తో పాటు కలెక్షన్స్ కూడా ఓ రేంజిలో వస్తున్నాయి. కలెక్షన్స్ చూస్తుంటే మూడురోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించేలా ఉందని ట్రేడ్ అంటోంది. ఈ క్రమంలో ఈ చిత్ర దర్శకుడు నెక్ట్స్ ఏ హీరోతో చెయ్యబోతున్నారు అనేది హాట్ టాపిక్ గా మారింది..
మీడియా వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు... టిల్లు స్క్వేర్ ఫేమ్ మల్లిక్ రామ్ ఓ వెబ్ సీరిస్ కు దర్శకత్వం వహించబోతున్నట్లు సమాచారం. సందీప్ కిషన్ హీరోగా చేయబోతున్న ఈ వెబ్సిరీస్ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ కాబోతున్నట్లు తెలిసింది. క్రైమ్, సస్పెన్స్ థ్రిల్లర్ అంశాలతో ఈ వెబ్సిరీస్ తెరకెక్కనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అల్లరి నరేష్తో ఆ ఒక్కటి అడక్కు సినిమాను నిర్మిస్తోన్న రాజీవ్ చిలుక...సందీప్కిషన్, మల్లిక్ రామ్ వెబ్సిరీస్కు నిర్మాతగా వ్యవహరించబోతున్నట్లు తెలిసింది. త్వరలోనే ఈ వెబ్సిరీస్కు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే అవకాశం ఉంది.
మరో ప్రక్క తాజాగా వైబ్ పేరుతో కొత్త సినిమాను సందీప్కిషన్ అనౌన్స్ చేశాడు. కాలేజీ స్టూడెంట్స్ జీవితాల నేపథ్యంలో యాక్షన్ థ్రిల్లర్గా తెరకెక్కుతోన్న వైబ్ మూవీకి ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ ఫేమ్ ఆర్ఎస్ జే స్వరూప్ దర్శకత్వం వహించబోతున్నాడు. 2025 వేసవిలో వైబ్ మూవీ రిలీజ్ కానుంది. తమిళంలో మయావన్ 2తో పాటు ధనుష్తో రాయన్ సినిమా చేస్తోన్నాడు సందీప్ కిషన్. ధనుష్ హీరోగా నటించిన కెప్టెన్ మిల్లర్లోనూ సందీప్కిషన్ గెస్ట్ రోల్ చేశాడు.