#RamCharan: చరణ్, శంకర్ చిత్రం USA రైట్స్ రేటు, దిల్ రాజుకు పండగే
రామ్ చరణ్ నటిస్తోన్న లేటెస్ట్ మూవీ ఆర్సి 15 ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ప్రస్తుతం సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇక సక్సెస్ ఫుల్ డైరెక్టర్ శంకర్…చరణ్ కాంబోలో రాబోతున్న ఈసినిమా పై ఇప్పటికే భారీగానే అంచనాలను క్రియేట్ చేశారు
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, క్రేజీ హీరోయిన్ కియారా అద్వానీ జంటగా ప్రముఖ దర్శకుడు శంకర్ ఓ భారీ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ మూవీ శరవేగంగా జరుగుతోంది. దిల్ రాజు భారీ బడ్జెట్తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రం గురించి రోజుకో విశేషం బయిటకు వచ్చి ఫ్యాన్స్ కు పండగ చేస్తోంది. తాజాగా ఈ మూవీ గురించిన ఓ అప్డేట్ ట్రేడ్ సర్కిల్స్ నుంచి వచ్చింది. ఇది ఇప్పుడు ఇండస్ట్రీని ఊపేస్తోంది. అదేమిటంటే..
ఈ సినిమాకు ఓవర్సీస్లో భారీ డిమాండ్ పలుకుతోంది. తాజాగా USA రైట్స్ ని 17 కోట్లకు అమ్మారని వినికిడి. ఈ రేటు పలకటంతో దిల్ రాజు ...గాల్లో తేలుతున్నాడని అంటున్నారు. ఎందుకంటే అసలు ఈ రేటు ఎవరూ ఊహించరు. ఆర్.ఆర్.ఆర్ సక్సస్ తో ఈ స్దాయి రేటు పలికిందని అంటున్నారు. ఈ ఇక ఈ సినిమా గురించి మరో వార్త మీడియాలో వైరల్ అవుతోంది. విషయం ఏమంటే ఈ సినిమా నాన్ థియేట్రికల్ రైట్స్ను ప్రముఖ మీడియా సంస్థ ZEE ఛానెల్ దాదాపు రూ. 200 కోట్ల రూపాయల కి కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఈ సినిమాకు స్ట్రీమింగ్ భాగస్వామిగా ZEE5 ఓటీటీతో డీల్ కుదర్చుకుందట.
చరణ్ కెరీర్ లో ఇది 15వ మూవీ. ఈ మూవీ పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కనుందని. చరణ్ డ్యూయల్ రోల్ లో నటిస్తున్నాడని టాక్. ఓ పాత్రలో ముఖ్యమంత్రిగా.. మరో పాత్రలో ఐఏఎస్ ఆఫీసర్గా చెర్రీ ఆకట్టుకోనున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సినిమాలో చరణ్ స్వాంత్య్ర సమరంలో పోరాడిన యోధుల్లో నేతాజీ సుభాష్ చంద్రబోస్ స్ఫూర్తితో స్వాంత్య్ర సమరంలో పాలు పంచుకున్న ఓ వ్యక్తి జీవిత కథ ఆధారంగా ఈ మూవీని శంకర్ తెరకెక్కిస్తున్నాడని తెలుస్తోంది.
దిల్ రాజు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్నారు. ఇతర ముఖ్య పాత్రల్లో సునీల్, అంజలి, శ్రీకాంత్, నవీన్ చంద్ర కనిపించనున్నారు. 2023 లో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రానికి సంగీత సంచలనం, థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటి వరకు జరిగిన షూటింగ్ తో సినిమా దాదాపుగా 70 శాతం వరకు పూర్తయిందని తెలుస్తోంది.