బాలీవుడ్ లో విషాదం చోటుచేసుకుంది. నటి, మోడల్ అర్య బెనర్జీ(33) అనుమానాస్పద రీతిలో కోల్ కతాలో చనిపోయారు. ‘ది డర్టీ పిక్చిర్’లో విద్యాబాలన్తో కలిసి నటించిన ఆమె కోల్కతాలోని తన నివాసంలో శుక్రవారం శవమై కనిపించారు.
బాలీవుడ్ లో విషాదం చోటుచేసుకుంది. నటి, మోడల్ అర్య బెనర్జీ(33) అనుమానాస్పద రీతిలో కోల్ కతాలో చనిపోయారు. ‘ది డర్టీ పిక్చిర్’లో విద్యాబాలన్తో కలిసి నటించిన ఆమె కోల్కతాలోని తన నివాసంలో శుక్రవారం శవమై కనిపించారు.
రోజూలాగే నిన్న ఉదయం పనిమనిషి వచ్చి తలుపు కొట్టగా బెనర్జీ ఎంతకీ తలుపులు తెరవలేదు. దీంతో పనిమనిషికి అనుమానం వచ్చి పోలీసులకు సమచారం అందించింది. వెంటనే అక్కడికి చేరుకున్న కోల్కతా పోలీసులు తలుపులు పగలకొట్టి లోపలికి వెళ్లి చూడగా బెడ్పై బెనర్జీ అపస్మారక స్థితిలో పడి ఉన్నారు.
అయితే నటి ఆర్య బెనర్జీ ముఖంపై గాయాలు ఉండటంతో ఇది హత్య, ఆత్మహత్యా అని పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. గత కొద్ది కాలంగా బెనర్జీ కలకత్తాలో ఒంటిరిగానే ఉంటున్నారని ఆమె పనిమనిషి పోలీసులకు తెలిపింది.
పనిమనిషి అందించిన సమాచారం మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు బెనర్జీది హత్య, ఆత్మహత్య అనే కోణంలో విచారణ చేపట్టారు. ఇదిలా ఉండగా నటి మరణ వార్త తెలియడంతో బాలీవుడ్ నటీనటులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.
ఆమె మృతి పట్ల సోషల్ మీడియాలో సంతాపం తెలుపుతున్నారు. బాలీవుడ్లో పలు సినిమాల్లో నటించిన ఆమె ప్రముఖ నటి సిల్క్ స్మిత జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ‘ది డర్టీ పిక్చర్’లో షకీలా పాత్ర పోషించారు.
Read Exclusive COVID-19 Coronavirus News updates, from Telangana, India and World at Asianet News Telugu.
వర్చువల్ బోట్ రేసింగ్ గేమ్ ఆడండి మిమ్మల్ని మీరు ఛాలెంజ్ చేసుకోండి ఇప్పుడే ఆడటానికి క్లిక్ చేయండి
Last Updated Dec 12, 2020, 11:39 AM IST