‘సరిలేరు నీకెవ్వరు’: నిజ జీవిత పాత్రలో తమన్నా
మహేష్ బాబు హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. రష్మిక హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రంలో విజయశాంతి కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించి ప్రతి సోమవారం అభిమానులకు ఓ ట్రీట్ ఇస్తున్న సంగతి తెలిసిందే. కాగా, తాజాగా మహేశ్-తమన్నాల ‘డాంగ్.. డాంగ్’ అంటూ సాగే పాట ను చిత్ర యూనిట్ విడుదల చేసింది.
మహేష్ బాబు హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. రష్మిక హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రంలో విజయశాంతి కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించి ప్రతి సోమవారం అభిమానులకు ఓ ట్రీట్ ఇస్తున్న సంగతి తెలిసిందే. కాగా, తాజాగా మహేశ్-తమన్నాల ‘డాంగ్.. డాంగ్’ అంటూ సాగే పాట ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ పాటలో తమన్నా స్టెప్ లు ఇరగతీసింది. ఈ సాంగ్ కథలో భాగంగా వస్తుందా..తమన్నా ఈ సినిమాలో ప్రత్యేకమైన పాత్ర పోషిస్తోందా అనే సందేహాలు చాలా మంది అభిమానులుకు కలుగుతున్నాయి.
అందుతున్న సమాచారం మేరకు...ఈ సినిమాలో తమన్నా నిజ జీవిత పాత్ర అయిన సినిమా నటిగా కనిపిస్తుందని తెలుస్తోంది. ఓ టీవి ఛానెల్ వారు ఆర్మీ క్యాప్ కు ఇండిపెండెన్స్ సెలబ్రేషన్స్ లో భాగంగా ఓ హీరయిన్ ని తీసుకొచ్చినప్పుడు ఈ పాట వస్తుందని తెలుస్తోంది. అందుకే ఈ పాటలో తమన్నా కూడా ఆర్మీ డ్రస్ లో కనపడుతుంది. మిగతా సైనికులు, మహేష్ తో కలిసి ఈ పాటలో కనిపిస్తారు.
దర్శకుడు అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. ‘ అందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూఇయర్. ‘సరిలేరు నీకెవ్వరు’ పాటలను ఆదరించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు. ఇంత మంచి పాటలు ఇచ్చిన దేవిశ్రీ ప్రసాద్గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఈ నెలలో ప్రతి సోమవారం ఒక్కో పాటతో మీ ముందుకు వచ్చాం. వాటిని మీరు ఆదరించి, టిక్టాక్లలో వీడియోలు కూడా చేశారు. చాలా సంతోషంగా ఉంది. ఇక ఆల్బమ్లో చివరి పాట మంచి పార్టీ సాంగ్ ఈ సోమవారం విడుదల చేయబోతున్నాం.
కొంతమంది సినీ స్టార్స్ను తీసుకెళ్లి, ఆర్మీతో ఇంట్రాక్ట్ చేయిస్తుంటారు. దానిని స్ఫూర్తిగా తీసుకుని, ఈ సినిమాలో తమన్నా కూడా ఒక సినీ స్టార్గా వచ్చి ఆర్మీతో కలిసి డాన్స్ చేస్తుంది. ఇది కేవలం సరదా పాట మాత్రమే. ఐటమ్ సాంగ్ కాదు. ఈ పాట కూడా మిమ్మల్ని అలరిస్తుందని ఆశిస్తున్నా. ఈ ఏడాది సంక్రాంతికి ‘ఎఫ్2’తో మంచి విజయాన్ని ఇచ్చారు. రాబోయే సంక్రాంతికి అంతే ఎంటర్టైన్మెంట్తో మహేష్ బాబు సరికొత్త పాత్రతో అలరించబోతున్నారు’ అని అన్నారు.
ఇప్పటికే షూటింగ్ పూర్తి చేస్తుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకొంటోంది. మహేష్ కూడా తన డబ్బింగ్నుపూర్తి చేశారు. సంక్రాంతి కానుకగా జనవరి 11న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.