Asianet News TeluguAsianet News Telugu

#SureshBabu: సురేష్ బాబుని ఎవరు హర్ట్ చేసారు? .. అసలేం జరిగింది ?

గతేడాది ఈయన నిర్మించిన దృశ్యం 2, నారప్ప సినిమాలు నేరుగా డిజిటల్ మీడియాలో విడుదలై మంచి విజయం అందుకున్నాయి. ఎప్పటికప్పుడు కొత్త ట్రెండ్ ఫాలో అవుతూ అప్‌డేట్ అవుతుంటాడు సురేష్ బాబు. వరస సినిమాలు నిర్మిస్తూనే ఉన్నాడు. అయితే గత కొంతకాలంగా సైలెంట్ గా ఉన్నారు..కారణమేంటి

Suresh Babu Goes Complete Silence?
Author
First Published Sep 21, 2022, 9:20 AM IST

టాలీవుడ్‌లో ఉన్న స్టార్  నిర్మాతలలో సురేష్ బాబు ఒకరు. రామానాయుడు కుమారుడుగానే కాకుండా ఆయనకు ప్రత్యేకమైన గుర్తింపు, ఫాలోయింగ్ ఉంది. ఆయన ప్రతీ విషయాన్ని చాలా విశ్లేషాత్మకంగా చెప్పగలుగుతారు. సినిమా పరిశ్రమలో లోతు,పాతులుగురించి ఆయనకు బాగా తెలుసు. ఓ టైమ్ లో ఈయన కథ ఫైనల్ చేసాడంటే పక్కాగా హిట్ అనే నమ్మకం ఉండేది. సురేష్ బాబు  నోటి నుంచి బాక్సాఫీస్ లెక్కలు.. సినిమా బడ్జెట్‌లు.. రిలీజ్ డేట్స్ తప్ప మరో విషయాలే రావు. తన ధ్యాస మొత్తం సినిమాలపైనే ఉంటుందని తెలుసు. అంతగా సినిమాలతోనే మమేకం అయిపోయాడు ఈయన. ఎప్పుడు చూసినా కూడా సినిమాల ప్రొడక్షన్ గురించి మాట్లాడుతుంటాడు ఈ నిర్మాత. అయితే గత కొంతకాలంగా సురేష్ బాబు సైలెంట్ గా ఉంటున్నారు.

ముఖ్యంగా మీడియాకి బాగా దూరంగా  ఉన్నారు. నారప్ప ప్రమోషన్స్ తర్వాత ఆయన వార్తల్లో కనపడింది లేదు. మీడియాతో ఇంటరాక్ట్ అయ్యిందీ లేదు. అప్పుడు వైజాగ్ లో రామానాయుడు స్టూడియోస్ పై వచ్చిన రూమర్స్ గురించి మాట్లాడారు. ఆ తర్వాత ఆయన మౌనం వహించారు. చివరకు ఎంతో పెద్ద ఇష్యూగా నడిచిన టిక్కెట్ రేట్లు గురించి సైతం ఆయన పెదవి విప్పలేదు. టాలీవుడ్ గిల్డ్ మీటింగ్ లలోనూ, వేరే ఇంటర్నల్ యాక్టివిటీస్ కు దూరంగా ఉన్నారు. తన సొంత సినిమాలు రిలీజ్ అవుతున్న సమయంలోనూ ఆయన మీడియా ముందుకు రాకపోవటం ఆశ్చర్యం వేస్తోంది. 

రీసెంట్ గా  రెజీనా కసాండ్రా మరియు నివేద థామస్ హీరోయిన్లుగా నటించిన "శాకిని డాకిని" సినిమా సెప్టెంబర్ 16న థియేటర్లో విడుదల అయ్యిన  సంగతి తెలిసిందే. సౌత్ కొరియాలో యాక్షన్ కామెడీగా విడుదలై సూపర్ హిట్ అయిన "మిడ్ నైట్ రన్నర్స్" అనే సినిమాకి రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమాకి సుధీర్ వర్మ దర్శకత్వం వహించారు. సురేష్ ప్రొడక్షన్స్ వారు గురు ఫిలిమ్స్ మరియు క్రాస్ పిక్చర్స్ వారితో సంయుక్తంగా ఈ సినిమాని నిర్మించారు.

 ఈ సినిమా ప్రమోషన్స్ లో సురేష్ బాబు కనిపిస్తారని చాలా మంది ఆశించారు. అదే పరిస్దితి తన నెక్ట్స్ ప్రాజెక్టు దొంగలున్నారు జాగ్రత్త సినిమాకు కనపడుతోంది. ఈ మౌనం వెనక అంతరార్దం ఏమిటో ఎవరికి అర్దం కావటం లేదు. ఈ నేపధ్యంలో ఎవరైనా సురేష్ బాబుని హర్ట్ చేసారా..అసలేం జరిగిందని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఆయనలాంటి స్టార్ ప్రొడ్యూసర్, ఎంతో మేధావి ఇలా సైలెంట్ గా ఉండటం మాత్రం పద్దతి కాదు. ఒక మేధావి మౌనం సమాజానికి ప్రమాదం.

Follow Us:
Download App:
  • android
  • ios