మేం ఇంట్లో ప్రశాంతంగా ఉంటే.. మీరు మాత్రం: మహేష్ బాబు
తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా వీరికి తన వంతుగా మద్దతు తెలిపాడు. ఇప్పటికే పోలీసులను ,డాక్టర్లను కీర్తిస్తూ ట్వీట్లు చేసిన మహేష్ తాజాగా పారిశుధ్య కార్మికులను ఉద్దేశిస్తూ ట్వీట్ చేశాడు. `మన పరిసరాలను శుభ్రంగా ఉంచుతున్న వారికోసం ఈ ట్వీట్. మనం అంతా ఇంట్లో సురక్షితంగా ఉంటే వారు మాత్రం బయట మన కోసం పనిచేస్తున్నారు. ప్రమాదాలు మన దరి చేరకుండా చూస్తున్నారు. ప్రాణాంతక వైరస్పై పోరాటంలో ముందు వరసులో నిలబడి మన కోసం యుద్ధం చేస్తున్నారు. వారందరికీ నా కృతజ్ఞతలు` అంటూ ట్వీట్ చేశాడు మహేష్.
ఇక సినిమాల విషయానికి వస్తే ఇటీవల సరిలేరు నీకెవ్వరు సినిమాతో సూపర్ హిట్ అందుకున్న సూపర్ స్టార్ మహేష్ బాబు. ప్రస్తుతం తదుపరి సినిమా విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకొలేదు. ముందుగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నట్టుగా ప్రకటించిన మహేష్ తరువాత ఆ ప్రాజెక్ట్ను పక్కన పెట్టేశాడు. ప్రస్తుతం గోత గోవిందం ఫేం పరశురాం దర్శకత్వంలో ఓ సినిమా చేసే ఆలోచనలో ఉన్నట్టుగా ప్రచారం జరుగుతోంది.