ఎస్బీ బాలుది రుక్మణీ కల్యాణం. శ్రీకృష్ణుడు రుక్మిణిని ఎత్తుకెళ్లి పెళ్లి చేసుకున్నాడనే విషయం అందరికీ తెలిసిందే. బాలసుబ్రహ్మణ్యం కూడా తన పెళ్లి విషయంలో చాలా సాహసమే చేశారు.
ఎస్బీ బాలసుబ్రహ్మణ్యం జీవితంలో ఆసక్తికరమైన సంఘటనలు ఉన్నాయి. దాదాపు 40 వేలకు పైగా 16 భాషల్లో పాటలు పాడి ప్రజలను ఊర్రూతలూగించిన బాలసుబ్రహ్మణ్యం మాత్రమే చాలా మందికి తెలుసు. ఆయన వ్యక్తిగత జీవితం గురించి చాలా తక్కువ తెలుసు.
ఎస్బీ బాలుది రుక్మణీ కల్యాణం. శ్రీకృష్ణుడు రుక్మిణిని ఎత్తుకెళ్లి పెళ్లి చేసుకున్నాడనే విషయం అందరికీ తెలిసిందే. బాలసుబ్రహ్మణ్యం కూడా తన పెళ్లి విషయంలో చాలా సాహసమే చేశారు. బెంగళూరులో ఉన్న సావిత్రిని ఎత్తుకెళ్లి సింహాచలంలో పెళ్లి చేసుకున్నాడు.
గోత్రాలు కలవడకపోవడం వల్ల ఇరు కుటుంబాల వాళ్లు వివాహానికి అంగీకరించలేదు. అయితే, ఎస్పీ బాలు మాత్రం అమ్మాయే కావాలని కోరుకున్నాడు. ఆ స్థితిలో సావిత్రిని ఆమె కుటుంబ సభ్యులు బెంగళూరులోని సోదరుల వద్దకు పంపించారు. తన మిత్రులతో కలిసి బాలసుబ్రహ్మణ్యం బెంగళూరు నుంచి విశాఖపట్నం తీసుకుని వచ్చాడు. మురళి, విఠల్ అనే మిత్రుల సాయంతో కారులో తీసుకుని వచ్చారు.
ఆ తర్వాత సింహాచలంలో సావిత్రిని పెళ్లి చేసుకున్నాడు. ఆర్. సుబ్రహ్మణ్యం అనే మిత్రుడు కన్యాదానం చేశారు.ఆ సమయంలో బాలు బృందం వద్ద కేవలం 500 రూపాయలు ఉన్నాయి. అవి పెళ్లి ఖర్చుల వరకు సరిపోయాయి. మద్రాసుకు వెళ్లడానికి డబ్బులు లేవు. మిత్రులు తలా ఇంతా వేసుకుని వారిద్దరిని మద్రాసు పంపించారు
పెళ్లి తర్వాత కూడా ఎవరూ చెంతకు రాలేదు. రెండేళ్ల పాటు వాళ్లంతా దూరంగానే ఉన్నారు ఆ సమయంలో కూతురు పల్లవి పుట్టింది. రెండేళ్ల తర్వాత ఒక్కరొక్కరే బాలు, సావిత్రి దంపతుల వద్దకు వచ్చి చేరారు. చెల్లెళ్లు, తమ్ముళ్లు బాలసుబ్రహ్మణ్యం వద్దనే ఉండిపోయారు.