కాజల్ బొమ్మ డేట్ ఫిక్స్.. బాగా ఎగ్జైట్ అవుతోంది!
12 ఏళ్ల క్రితం లక్ష్మి కళ్యాణం సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైన బ్యూరో కాజల్ అగర్వాల్. టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన కొద్దీ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా తనకంటూ ఒక బ్రాండ్ దక్కించుకుంది. జయాపజయాలతో సంబంధం లేకుండా తన క్రేజ్ పెంచుకుంటున్న చందమామ ఇండస్ట్రీకి వచ్చి ఎన్నేళ్లయినా అదే అందంతో మెరుస్తోంది.
అప్పుడెప్పుడో 12 ఏళ్ల క్రితం లక్ష్మి కళ్యాణం సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైన బ్యూరో కాజల్ అగర్వాల్. టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన కొద్దీ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా తనకంటూ ఒక బ్రాండ్ దక్కించుకుంది. జయాపజయాలతో సంబంధం లేకుండా తన క్రేజ్ పెంచుకుంటున్న చందమామ ఇండస్ట్రీకి వచ్చి ఎన్నేళ్లయినా అదే అందంతో మెరుస్తోంది.
ఇకపోతే సౌత్ ఇండస్ట్రీలో చందమామగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ ఇప్పుడు మరో గౌరవాన్ని అందుకుంది. అరుదైన మేడమ్ టుస్సాడ్స్ సింగపూర్ లొకేషన్ లో కాజల్ అగర్వాల్ మైనపు విగ్రహాన్ని ప్రదర్శించనున్న విషయం తెలిసిందే. అయితే గత కొన్ని రోజులుగా ఆ స్టాచుకి తుది మెరుగులు దిద్దుతున్న నిర్వాహకులు ఫైనల్ గా రెడీ చేశారట. ఆ విషయాన్నీ చెబుతూ.. విగ్రహం ఆవిష్కారణ తేదీ గురించి కాజల్ సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది.
సెలబ్రెటీల రూపాలను మైనపు బొమ్మలుగా చేసి ప్రాణం తప్ప అన్ని ఛాయలు కనిపించేలా చేసే మేడమ్ టుస్సాడ్స్ ఇప్పటికే ఎంతో మంది భారత సెలబ్రటీల బొమ్మలను ప్రజెంట్ చేసింది. ఇక ఇప్పుడు కాజల్ టైమ్ వచ్చింది. ఫిబ్రవరి 5వ తేదీన కాజల్ బొమ్మను ప్రదర్శించబోతున్నారు. సంతోషంగా తేదీని ప్రకటిస్తూ.. తెగ ఎగ్జైట్ అవుతోంది. ఇక అభిమానులు కూడా ఆమెకు బెస్ట్ విషెస్ అందిస్తున్నారు.
టాలీవుడ్ నుంచి ఇప్పటికే మహేష్ బాబు - ప్రభాస్ మైనపు బొమ్మలను తయారు చేసిన మేడమ్ టుస్సాడ్స్ ఇప్పుడు కాజల్ అగర్వాల్ బొమ్మను ఏర్పాటు చేసేందుకు సిద్ధమయ్యారు. నిర్వాహకులు కాజల్ నుంచి కొలతలు కూడా తీసుకున్నారు. ప్రస్తుతం అందుకు సంబందించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇకపోతే కాజల్ చివరగా తెలుగులో రణరంగం సినిమాలో నటించిన విషయం తెలిసిందే.