షారూఖ్ ఖాన్ ఇంట్లో ఆ విగ్రహం.. ఆశ్చర్యంలో ఫ్యాన్స్..!
బాలీవుడ్ సినీ ప్రముఖులంతా పాటలు పాడుతూ ఐ ఫర్ ఇండియా పేరుతో ఫండ్ రైజ్ చేస్తున్నారు. అందులో భాగంగా షారూఖ్ ఖాన్ కూడా తనలో గాయకుడ్ని బయటకు తీశాడు. తన ఇంట్లోని ఆఫీష్ రూం నుంచే లైవ్ కాన్సర్ట్లో పాల్గొన్నాడు. అయితే షారూఖ్ పాట పాడుతుండగా ఆయన వెనక ఉన్న బ్యాక్ గ్రౌండ్ ఇప్పడు హాట్ టాపిక్గా మారింది.
ప్రస్తుతం కరోనా కారణంగా ఇళ్లకే పరిమితమైన సెలబ్రిటీలు అభిమానులను అలరించేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. అదే సమయంలో కరోనా కారణంగా కష్టాలు పడుతున్న ప్రజలను ఆదుకునేందుకు తమ వంతు సాయం చేస్తున్నారు. ఈ లిస్ట్ లో బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్ ముందే ఉన్నాడు. ఆర్ధిక సాయంతో పాటు ముంబైలోని తమ నాలుగంతస్థుల ఆఫీస్ బిల్డింగ్ను కరోనా పేషంట్ల క్వారెంటైన్ సెంటర్గా వినియోగించుకునేందుకు ముంబై మున్సిపాలిటీకి ఇచ్చారు.
అయితే తాజాగా బాలీవుడ్ స్టార్స్ అంతా కలిసి ఓ వినూత్నకార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. విర్చ్యువల్ కన్సర్ట్ పేరుతో బాలీవుడ్ సినీ ప్రముఖులంతా పాటలు పాడుతూ ఐ ఫర్ ఇండియా పేరుతో ఫండ్ రైజ్ చేస్తున్నారు. అందులో భాగంగా షారూఖ్ ఖాన్ కూడా తనలో గాయకుడ్ని బయటకు తీశాడు. తన ఇంట్లోని ఆఫీష్ రూం నుంచే లైవ్ కాన్సర్ట్లో పాల్గొన్నాడు. అయితే షారూఖ్ పాట పాడుతుండగా ఆయన వెనక ఉన్న బ్యాక్ గ్రౌండ్ ఇప్పడు హాట్ టాపిక్గా మారింది.
వీడియోలో షారూఖ్ వెనక ఒక పక్క ముస్లిం మత గ్రంథం ఖురాన్ కనిపిస్తుండగా మరో పక్క షెల్ఫ్లో వినాయక విగ్రహం ఉంది. షారూఖ్ ఖాన్ ముస్లిం అన్న సంగతి తెలిసిందే. ఆయన హిందువైన గౌరీని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అందుకే వారి ఇంట్లో రెండు మతాలకు సంబంధించిన పండుగలను సెలబ్రేట్ చేస్తుంటారు. తాజాగా షారూఖ్ ఆఫీస్ రూంలో వినాయక విగ్రహం కూడా ఉండటంపై అభిమానులు ఆశ్చర్యంతో పాటు హర్షం వ్యక్తం చేస్తున్నారు.