'గీత గోవిందం' డైరక్టర్ ని టెన్షన్ లో పడేసిన రష్మిక
యంగ్ డైరెక్టర్ పరుశరామ్ దర్శకత్వంలో తెరకెక్కిన 'గీత గోవిందం' చిత్రం క్రితం సంవత్సరం ఆగస్ట్ 15న విడుదలై... పెద్ద హిట్టైంది.ఈ సినిమాలో పెయిర్ గా చేసిన విజయ్ దేవరకొండ, కన్నడ బ్యూటీ రష్మిక..ఇద్దరూ ఫుల్ బిజీ అయ్యిపోయారు.
యంగ్ డైరెక్టర్ పరుశరామ్ దర్శకత్వంలో తెరకెక్కిన 'గీత గోవిందం' చిత్రం క్రితం సంవత్సరం ఆగస్ట్ 15న విడుదలై... పెద్ద హిట్టైంది.ఈ సినిమాలో పెయిర్ గా చేసిన విజయ్ దేవరకొండ, కన్నడ బ్యూటీ రష్మిక..ఇద్దరూ ఫుల్ బిజీ అయ్యిపోయారు. రష్మిక అయితే ఒక్క రోజు ఖాళీ లేనంతగా ఉంది పరిస్దితి.
ఈ సంక్రాంతికి విడుదల అవుతున్న మహేష్ చిత్రం సరిలేరు నీకెవ్వరులోనూ ఆమే హీరోయిన్. ఈ సినిమా విజయం సాధిస్తే ఇకే వరసపెట్టి స్టార్స్ సరసనే ఆఫర్స్ వస్తాయనటంలో సందేహం లేదు. ఈ క్రమంలో ఆమెతో మళ్లీ సినిమా చేయాలని పరుశరామ్ ప్లాన్ చేస్తున్నాడు. తను హిట్ ఇచ్చిన హీరోయిన్ కాబట్టి తనకు డేట్స్ ఇవ్వటంలో వెనకాడదని ఆయన ఆలోచన. అయితే అది కష్టమే అని తెలుస్తోంది.
పరుశరామ్ చెప్పిన కథకు అక్కినేని నాగచైతన్య ఇంప్రెస్ అయ్యి..వెంటనే డేట్స్ ఇవ్వటానికి ముందుకు వచ్చారు. ఓ రొమాంటిక్ కామెడీ స్క్రిప్టుని నాగచైతన్యకు చెప్పి ఒప్పించిన పరుశరామ్ త్వరలోనే ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రారంభించబోతున్నారు. 2020 మే ఫస్ట్ వీక్ నుంచి ఈ సినిమా ప్రారంభం అవుతుంది. సంక్రాంతికి ఈ సినిమాకు సంభందించిన ఎనౌన్సమెంట్ వచ్చేలా ప్లాన్ చేస్తున్నారు.
ఇక ఈ సినిమాని 14 రీల్స్ బ్యానర్ పై గోపీ ఆచంట, రామ్ ఆచంట కలిసి నిర్మిస్తారు. ఈ సినిమాతో చైతులోని మరో యాంగిల్ ని పరుశరామ్ ఆవిష్కరించబోతున్నారట. అంతా బాగానే ఉంది కానీ రష్మికకు కథ,క్యారక్టరైజేషన్ చెప్పినా ఇప్పటిదాకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదట. దాంతో సంక్రాంతి రోజు ఆమె లేకుండానే ఎనౌన్సమెంట్ ఇవ్వాలా...అనే డైలమోలో టీమ్ ఉందిట. రష్మిక ఇలా ట్విస్ట్ ఇస్తుందని ఊహించలేదట. అయితే సంక్రాంతి సినిమా విషయం తేలకుండా ఎలా వెంటనే సినిమా ఒప్పేసుకోవాలనే అనే ఆలోచనలో ఆమె ఉందిట.
పరుశరామ్ మాట్లాడుతూ..కేవలం ఒక సెక్షన్ ఆఫ్ ఆడియెన్స్ ని టార్గెట్ చేద్దామని కథలు రాసుకోవడం అనే జరగదు. ఓ కథ ఎవరికి నచ్చాలో వారికే నచ్చుతుంది. యాధృచికంగా నా నుంచి వచ్చిన లాస్ట్ రెండు సినిమాలు ఫ్యామిలీ ఆడియెన్స్ కి నచ్చింది. కానీ గీతగోవిందం ఇటు యూత్ కి అటు ఫ్యామిలీస్ కి నచ్చింది. ఇప్పుడు చేయబోయే కథ కూడా అన్ని వర్గాలకు నచ్చేలా డిజైన్ చేసాము అంటున్నారు.