మాస్ మహారాజా నటించిన లేటెస్ట్ మూవీ రామారావ్ ఆన్ డ్యూటీ. మంచి అంచనాల నడుమ జూలై 29న విడుదలైన ఈ సినిమాకు ఫస్ట్ షో నుంచే మిక్స్డ్ టాక్ వచ్చింది. దీంతో అనుకున్న రేంజ్‌లో ఫస్ట్ డే కలెక్షన్స్‌ను రాబట్టలేకపోయింది. 


మాస్‌ మహారాజా రవితేజ నటించిన లెటెస్ట్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ చిత్రం ‘రామారావు ఆన్‌ డ్యూటీ’. యువ దర్శకుడు శరత్‌ మండవ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ, రవితేజ టీం వర్క్స్ బ్యానర్ల పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ చిత్రంలో రజిషా విజయన్, దివ్యాంశ కౌశిక్‌ హీరోయిన్స్ గా నటించారు. భారీ అంచనాల మధ్య జులై 29న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఓటిటి రిలీజ్ కు రెడీ అయ్యింది.

ఈ సినిమా ఓటిటి రైట్స్ ని Sony Liv వారు తీసుకున్నారు. సెప్టెంబర్ 15 నుంచి ఈ చిత్రం Sony Liv లో స్ట్రీమింగ్ కానుంది. దాదాపు ఆరు వారాల తర్వాత ఓటిటి ఎంట్రీ ఇవ్వబోతోందన్నమాట. ఈ చిత్రానికి తొలిరోజు మార్నింగ్ షోకే డిజాస్టర్ టాక్ లభించింది. అయితే ఉన్నంతలో రిలీజ్ రోజు మార్నింగ్ షోకు ఓపినింగ్స్ ఫరవాలేదనిపించాయి. కానీ మాట్నీ నుంచి ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద చతికిలపడింది. 

మాస్ మహరాజా రవితేజ సినిమాలు ఈ మధ్య కాలంలో పెద్దగా ఆడలేదు. ‘క్రాక్‌’తర్వాత రవితేజ ఖాతాలో బిగ్‌ హిట్‌ పడిందే లేదు. భారీ అంచనాల మధ్య వచ్చిన ‘ఖిలాడి’ఆశించిన స్థాయిలో ఫలితాన్ని రాబట్టలేకపోయింది. ఈసారి ఎలాగైన హిట్‌ కొట్టాలన్న పట్టుదలతో చేసాడు రవితేజ. తన స్టయిల్‌ని పక్కన పెట్టి, డిఫరెంట్‌ కాన్సెప్ట్‌తో కూడిన ‘రామారావు ఆన్‌ డ్యూటీ’ సినిమా ని పట్టాలు ఎక్కించాడు. 

1993 లో జరిగిన కొన్ని యధార్ధ సంఘటనలు ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించాడు శరత్‌ మండవ. ఇదొక ఎమోషనల్‌ ఇన్వెస్ట్ గేటివ్ యాక్షన్‌ థ్రిల్లర్ చిత్రం. సినిమా ప్రారంభం నుండే ట్విస్ట్ లు మొదలవుతాయి. కానీ ఏమీ వర్కవుట్ కాలేదు. ‘రామారావు ఆన్ డ్యూటీ’ చిత్రానికి రూ.17.72 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలి అంటే రూ.18 కోట్ల షేర్ ను రాబట్టాలి. కానీ అందులో పావు వంతు కూడా రికవరీ కాలేదు. మరి ఓటిటిలో ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాల్సిన అవసరం ఉంది.