డైరెక్టర్ పై రూమర్స్.. బాయ్ ఫ్రెండ్ ని పరిచయం చేసిన హీరోయిన్!
తమిళ నటి ప్రియా భవాని శంకర్ ఇప్పుడిప్పుడే మంచి ఆఫర్స్ అందుకుంటోంది. తమిళంలో కడై కుట్టి సింగం, మాన్ స్టర్ లాంటి చిత్రాల్లో ప్రియా భవాని నటించింది. మొదట సాఫ్ట్ వేర్ ఉద్యోగిగా కెరీర్ ప్రారంభించిన ప్రియా భవాని.. ఆ తర్వాత న్యూస్ యాంకర్ గా మీడియాలోకి అడుగుపెట్టింది.
తమిళ నటి ప్రియా భవాని శంకర్ ఇప్పుడిప్పుడే మంచి ఆఫర్స్ అందుకుంటోంది. తమిళంలో కడై కుట్టి సింగం, మాన్ స్టర్ లాంటి చిత్రాల్లో ప్రియా భవాని నటించింది. మొదట సాఫ్ట్ వేర్ ఉద్యోగిగా కెరీర్ ప్రారంభించిన ప్రియా భవాని.. ఆ తర్వాత న్యూస్ యాంకర్ గా మీడియాలోకి అడుగుపెట్టింది. 2017లో నటిగా మారింది. ప్రస్తుతం ప్రియా భవాని చేతిలో అర డజనుకు పైగా చిత్రాలు ఉన్నాయి.
కెరీర్ జోరందుకుంటున్న తరుణంలో ఆమెపై సోషల్ మీడియాలో ఆమె గురించి కొన్ని రూమర్స్ వినిపించాయి. దర్శకుడు, నటుడు అయిన ఎస్ జె సూర్య.. ప్రియా భవాని శంకర్ కు లవ్ ప్రపోజ్ చేసినట్లు.. ఆమె రిజెక్ట్ చేసినట్లు వార్తలు వచ్చాయి. ఈ వార్తలపై ఎస్ జె సూర్య తీవ్రంగా మండిపడ్డాడు. ఈ వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని.. ప్రియా భవాని తనకు మంచి స్నేహితురాలిని తెలిపాడు.
తాజాగా ప్రియా భవాని శంకర్ అభిమానులకు ఊహించని సర్ ప్రైజ్ ఇచ్చింది. సోషల్ మీడియా ద్వారా తన ప్రియుడిని పరిచయం చేసింది. ఇన్స్టాగ్రామ్ లో తన ప్రియుడితో ఉన్న ఫోటో షేర్ చేసి లెంగ్తీ పోస్ట్ పెట్టింది. ' అల్లరిగా, సంతోషంగా, యావరేజ్ అందంతో ఉన్న నాతో నువ్వు పదేళ్ల కృతేమే ప్రేమలో పడ్డావంటే ఆశ్చర్యంగా ఉంది. ఇప్పిటికీ నేను యావరేజ్ అందంతోనే ఉన్నాను. అయినా కూడా నీవు నాతోనే ఉండాలని నిర్ణయించుకున్నావు. నీకు జన్మదిన శుభాకాంక్షలు అంటూ తన ప్రియుడిని ఉద్దేశించి ప్రియా భవాని పేర్కొంది.
అతడి పేరుని మాత్రం ప్రియా భవాని ప్రకటించలేదు.అతడి పేరు రజ్వల్ అని ప్రచారం జరుగుతోంది. రజ్వల్, ప్రియా భవాని కాలేజ్ స్నేహితులట. ప్రస్తుతం రజ్వల్ ఆస్ట్రేలియాలో ఉద్యోగం చేస్తున్నాడు.
మొత్తంగా తన గురించి, ఎస్ జె సూర్య గురించి వస్తున్న రూమర్స్ కు ఈ పోస్ట్ తో ప్రియా భవాని చెక్ పెట్టింది. మరి ఈ జంట ఇలాగే రిలేషన్ షిప్ కొనసాగిస్తారా లేక త్వరలో పెళ్లి పీటలు ఎక్కుతారా అనేది వేచిచూడాలి.