కోవిడ్ ఎఫెక్ట్: ప్రభాస్ మూవీ ఆడిషన్స్ క్యాన్సిల్!
మహానటి ఫెమ్ నాగ్ అశ్విన్ తో సినిమా చేస్తున్నాడు రెబల్ స్టార్ ప్రభాస్. ఈ సినిమాలో ప్రభాస్ సరసన బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే హీరోయిన్ గా నటించనుందన్న విషయం తెలిసిందే. ఈ సినిమా గురించి ఓ క్రేజీ న్యూస్ వైరల్ అవుతోంది.
గత సంవత్సర కాలంగా పెద్ద సినిమాలపై ఏదో విధంగా కోవిడ్ ప్రభావం చూపెడుతూనే ఉంది. ఇప్పటికే చాలా సినిమాలు కోవిడ్ భయంతో షూటింగ్ లు లేటు చేసుకున్నాయి. మరో ప్రక్క కోవిడ్ ఎఫెక్ట్ తో థియోటర్స్ చాలా రాష్ట్రాల్లో తెరుచుకోవటం లేదు. ఇవి చాలదన్నట్లు ఇప్పుడు ఆడిషన్స్ కూడా కాన్సిల్ అవుతున్నాయి.
వివరాల్లోకి వెళితే... ప్రభాస్, దీపికా పదుకొనే హీరోహీరోయిన్లుగా నాగఅశ్విన్ దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందనున్న సంగతి తెలిసిందే. వైజయంతి మూవీస్ పతాకంపై సీనియర్ నిర్మాత అశ్వనీదత్ రూపొందిస్తున్న ఈ చిత్రం ఓ సైంటిఫిక్ థ్రిల్లర్. ‘ప్రాజెక్ట్ కె’ వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ మూవీ ను నాగ అశ్విన్ గ్రాండ్ స్కేల్ లో తెరకెక్కించబోతున్నారు. అందుకోసం జండర్, ఏజ్ తో నిమిత్తం లేకుండా యాక్టర్స్, మోడల్స్, మార్షల్ ఆర్టిస్ట్స్, డాన్సర్స్ కోసం ఆడిషన్స్ మొదలు పెట్టారు
ప్రధానంగా బెంగళూర్, చెన్నయ్, పాండిచ్చేరి, కొచ్చిలో ఇవి జరుగుతున్నాయి. నిన్న చెన్నయ్ లో ఆడిషన్స్ పూర్తి చేసిన ఈ చిత్ర యూనిట్ ఇవాళ బెంగళూర్ లో ఆడిషన్స్ జరుపుతోంది. అయితే ఈ నెల 15న కొచ్చిలో జరగాల్సిన ఆడిషన్స్ ను కొవిడ్ నిబంధనల కారణంగా రద్దు చేసినట్టు చిత్ర నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ తెలిపింది. తిరిగి ఎప్పుడు ఆడిషన్స్ జరిపేది త్వరలో తెలియచేస్తామని చెప్పింది. ఇక ఈ చిత్రం షూటింగ్ లో అమితాబ్ బచ్చన్ ఇప్పటికే పాల్గొన్నారు.
ఇక పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇప్పటికే రాధేశ్యామ్ సినిమాను పూర్తి చేసిన డార్లింగ్ ఇప్పుడు సలార్ సినిమా షూటింగ్ లో జాయిన్ అవుతున్నాడు. రాధా కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రాధేశ్యామ్ సినిమా దాదాపు పూర్తయ్యింది. ఈ సినిమాలో బుట్టబొమ్మ పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. పిరియాడికల్ లవ్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కుతుంది.
సలార్ విషయానికొస్తే కేజీఎఫ్ సినిమా తో సంచలన విజయం అందుకున్న ప్రశాంత్ నీల్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుంది. కంప్లీట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు ప్రశాంత్ నీల్. సలార్ తో పాటు ఆదిపురుష్ సినిమాను కూడా బాలన్స్ చేస్తూ ఫినిష్ చేస్తున్నాడు ప్రభాస్. ఆదిపురుష్ సినిమాను బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ తెరకెక్కస్తున్నాడు.