Asianet News TeluguAsianet News Telugu

అఖిల్ సినిమాలో పూజా హెగ్డే పాత్ర...తెలుగు తెరపై రానిది!

అందుతున్న సమాచారం మేరకు పూజ హెడ్గే పాత్ర ఓ స్టాండప్ కమిడియన్ అని తెలుస్తోంది. ఇప్పుడిప్పుడే తెలుగులో ప్రాచుర్యంలోకి వస్తున్నారు స్టాండప్ కమిడయన్స్. ఆ విషయం గమనించిన దర్శకుడు ట్రెండీగా ఉంటుందని ఆ పాత్రను హీరోయిన్ చేత చేయిస్తున్నారు. 

Pooja Hedge's role in Bommarillu Bhaskar film
Author
Hyderabad, First Published Jan 9, 2020, 5:23 PM IST

ఏదో ఒక కొత్తదనం లేకపోతే సినిమాలు నడవటం లేదు. హీరో అంటే విలన్ తో ఫైట్స్, హీరోయిన్ పాత్ర అంటే కాస్త గ్లామర్ గా కనపడుతూ..పాటల్లో అదరకొడితే చాలు అన్నట్లు ఉండే రోజులు వెళ్ళిపోయాయి. అందుకే ప్రతీ పాత్రను చాలా జాగ్రత్తగా చెక్కుతున్నారు దర్శకులు. హీరో,హీరోయిన్స్ క్యారక్టరైజేషన్స్ ప్రత్యేకంగా ఓ గుర్తింపు ఉండేలా రెడీ చేయటంలో బొమ్మరిల్లు భాస్కర్ స్పెషాలిటీ. అఖిల్ తో చేస్తున్న చిత్రంలో ఆయన హీరోయిన్ పూజ హెడ్గేకు అలాంటి పాత్ర ఒకటి తయారు చేసినట్లు సమాచారం. ఆ పాత్ర కోసం ఆమె ప్రత్యేకమైన కసరత్తు చేస్తోందట.

అందుతున్న సమాచారం మేరకు పూజా హెగ్డే పాత్ర ఓ స్టాండప్ కమిడియన్ అని తెలుస్తోంది. ఇప్పుడిప్పుడే తెలుగులో ప్రాచుర్యంలోకి వస్తున్నారు స్టాండప్ కమిడయన్స్. ఆ విషయం గమనించిన దర్శకుడు ట్రెండీగా ఉంటుందని ఆ పాత్రను హీరోయిన్ చేత చేయిస్తున్నారు. అయితే పూజా హెగ్డేకు పెద్దగా స్టాండప్ కామెడీలపై పెద్దగా అవగాహన లేదట. యుట్యూబ్ వీడియోలు చూసి ప్రాక్టీస్ చేద్దామనుకుంది కానీ..అది కష్టం అనిపించి కొంతమంది స్టాండప్ కమెడియన్స్ ని కలుస్తూ ట్రైనింగ్ తీసుకుంటోందని ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం. ఆ పాత్ర చాలా డిఫరెంట్ గా ఉంటుందని,కొద్దిగా కష్టమనిపించినా తనకు మంచి పేరు వస్తుందని రాత్రింబవళ్లూ కష్టపడుతోందట.

మహేష్ బాబుకి జగన్ ఆఫర్..!

మరో ప్రక్కకెరీర్ మొదట నుంచి ఒక్క హిట్టూ లేని అఖిల్ ...చాలా డెస్పరేట్ గా ఉన్న సంగతి తెలిసిందే. వరుసగా 'అఖిల్' మరియు 'హలో' సినిమాలు ఫ్లాప్ అయిన తర్వాత ఈ యువహీరో  'మిస్టర్ మజ్ను' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. వెంకీ అట్లూరి దర్శకత్వంలో విడుదలైన ఈ సినిమా  సైతం ప్రేక్షకులను పెద్దగా మెప్పించలేకపోయింది.  దాంతో దాదాపు ఏడు నెలల వెయిట్ చేసి మరీ  కెమెరా ముందుకు వచ్చారు అఖిల్‌.

‘బొమ్మరిల్లు’ భాస్కర్‌ దర్శకత్వంలో అఖిల్‌ హీరోగా ఈ  సినిమా ఆరంభమైంది.  మొదటి సినిమాతోనే నంది అవార్డ్ గెలుచుకున్న బొమ్మరిల్లు భాస్కర్ తన తర్వాత సినిమాలతో పెద్దగా మెప్పించలేకపోయాడు. ఆఖరి సారిగా తెలుగులో 'ఒంగోలుగిత్త' సినిమాకు దర్శకత్వం వహించిన బొమ్మరిల్లు భాస్కర్ ఇప్పుడు అఖిల్ సినిమాతో మళ్లీ ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ సినిమాను మెగా నిర్మాత అల్లు అరవింద్ గీతాఆర్ట్స్ పతాకంపై నిర్మించటం ఒకటే సినిమాపై ఆసక్తిని పెంచే విషయం.

 అఖిల్ ఈ సినిమాలో అప్పర్ మిడిల్ క్లాస్ యువకుడుగా కనిపించనున్నారు. గీతా గోవిందం తరహాలో ఇదో రొమాంటిక్ ఎంటర్టైనర్. జీఏ2 పిక్చర్స్‌ పతాకంపై అల్లు అరవింద్‌ సమర్పణలో ‘బన్నీ’ వాసు, వాసు వర్మ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ హైదరాబాద్‌లో మొదలై జరుగుతోంది.

Follow Us:
Download App:
  • android
  • ios