Panchathantram Trailer : ఐదు కుటుంబాల కథతో జీవితాన్ని చూపే ‘పంచతంత్రం’.. ఇంట్రెస్టింగ్ ట్రైలర్.!
కళా బ్రహ్మ, డాక్టర్ బ్రహ్మానందం, యంగ్ హీరోయిన్ శివాత్మిక, కలర్స్ స్వాతి నటించిన తాజా చిత్రం ‘పంచతంత్రం’. రిలీజ్ కు సిద్ధంగా ఉన్న ఈ మూవీని ఇంట్రెస్టింగ్ ట్రైలర్ ను విడుదల చేశారు. ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా ఉంది.
ఐదు కుటుంబాల గాధగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ‘పంచతంత్రం’. టికెట్ ఫ్యాక్టరీ, ఒరిజినల్స్ పతాకాలపై అఖిలేష్ వర్దన్, సృజన్ ఎరబోలు నిర్మిస్తోన్న ఈ చిత్రానికి హర్ష పులిపాక దర్శకత్వం వహిస్తున్నారు. కళా బ్రహ్మ, డాక్టర్ బ్రహ్మానందం, స్వాతి రెడ్డి, సముద్ర ఖని, రాహుల్ విజయ్, శివాత్మిక రాజశేఖర్, నరేష్ అగస్త్య, దివ్య ద్రిష్టి, వికాస్ ముప్పల ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. డిసెంబర్ 9న గ్రాంగ్ గా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఇప్పటికే సినిమా నుంచి వచ్చిన క్రేజీ అప్డేట్స్ సినిమాపై ఆసక్తిని పెంచుతున్నారు. ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా ట్రైలర్ ను కూడా విడుదలైంది. ట్రైలర్ను స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న (Rashmika Mandanna) విడుదల చేసి చిత్ర యూనిట్కి అభినందనలు తెలియజేసింది.
ఇక ట్రైలర్ విషయానికొస్తే.. ఇది ఐదు జంటలకు సంబంధించిన కథ అని అర్థమవుతుంది. బ్రహ్మానందం ఈ ఐదు కథలను పంచేద్రియాలుగా తన కోణంలో వర్ణించారు. జీవితంలో ఎన్నో ఆటుపోట్లు ఉంటాయి. సంతోషాలే కాదు.. బాధలు కూడా వస్తుంటాయి. అలా వచ్చినప్పుడు మనం వాటిని ఎలా స్వీకరించాం. మన పనులను ఎంత బాధ్యతగా పూర్తి చేస్తూ ముందుకెళ్లామనేది కథాంశంగా తెలుస్తోంది. సినిమాలో కనిపించబోయే ఐదు జంటలకు ఒక్కో కథ .. ఒక్కో రకమైన ప్రయాణం.. అవన్నీ ఎలాంటి ముగింపుతో ఎండ్ అయ్యాయనేదే ‘పంచతంత్రం’ సినిమా.
ఫీల్ గుడ్ ఎంటర్టైనర్గా హార్ట్ టచింగ్ ఎమోషన్స్తో సినిమా ఉండబోతుందని ట్రైలర్ ద్వారా తెలుస్తోంది. ఆద్యంతం ఆసక్తికరంగా సాగిన ఈ ట్రైలర్ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. ప్రతి కథలో మన చుట్టూ ఉన్న సమాజాన్ని అందులో వ్యక్తుల వ్యక్తిత్వాలను దర్శకుడు హర్ష ఎంతో అర్థవంతంగా ముందుకు తీసుకెళ్లిన్నట్లు తెలుస్తోంది. ఇలాంటి ఫీల్ గుడ్ యాంథాలజీని దర్శకుడు ఎలా ట్రీట్ చేశారనే ఆత్రుత కూడా కలుగుతుంది. అర్థవంతమైన సంభాషణలు పాత్ర తాలూకూ భావోద్వేగాలను సెన్సిబుల్గా ఎలివేట్ చేస్తున్నాయి. ఇక చిత్రానికి ప్రశాంత్ ఆర్.విహారి సంగీతం అందించారు. రాజ్ కె.నల్లి సినిమాటోగ్రఫీ గా పనిచేశారు.