సోషల్ మీడియా వేధింపులపై నటి నిధి అగర్వాల్ హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఓ వ్యక్తి తనను, కుటుంబాన్ని చంపుతానని బెదిరిస్తూ, అసభ్యకర సందేశాలు పంపుతున్నాడని ఆరోపించారు. నిందితుడిపై చర్యలు తీసుకోవాలని కోరారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఓ గుర్తుతెలియని వ్యక్తి తనను సోషల్ మీడియాలో వేధిస్తున్నాడని ప్రముఖ నటి నిధి అగర్వాల్.. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. ఓ వ్యక్తి తనను, తన కుటుంబాన్ని చంపుతానని బెదిరిస్తున్నాడని, అసభ్యకర మెసేజ్‌లతో తన ఇన్‌స్టా అకౌంట్‌ను పదేపదే ట్యాగ్ చేస్తున్నాడని ఫిర్యాదు చేశారు. నిందితుడిని గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.

వివరాల్లోకి వెళితే...సోషల్​ మీడియాలో ఓ వ్యక్తి తనని టార్గెట్​చేసి నిత్యం వేధిస్తున్నాడని సినీ హీరోయిన్ ​నిధి అగర్వాల్ హైదరాబాద్​సైబర్ ​క్రైమ్ ​పోలీసులను ఆశ్రయించారు. ఆ వ్యక్తి బెదిరింపుల వల్ల తాను, తన కుటుంబం మానసికంగా ఒత్తిడికి లోనవుతున్నామని సైబర్ క్రైమ్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో నిధి అగర్వాల్ పేర్కొంది.సదరు వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని ఆన్​లైన్​లో ఫిర్యాదు చేసింది. తనతోపాటు తన స్నేహితులను, బంధువులను టార్గెట్​చేసి సోషల్ ​యాప్స్​లో బెదిరింపులకు దిగుతున్నాడని పేర్కొంది. నిందితుడిని గుర్తించి, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని నిధి అగర్వాల్ పోలీసులను కోరింది. ఈ మేరకు స్పందించిన పోలీసులు నిధి అగర్వాల్ ఫిర్యాదుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ప్రస్తుతం హీరోయిన్ నిధి అగర్వాల్ ఇద్దరు అగ్ర హీరోల సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. పవన్‌ సరసన ‘హరిహర వీరమల్లు’లో, ప్రభాస్‌ ‘రాజా సాబ్‌'లోనూ నటిస్తున్నారు. ఈ రెండు సినిమాల అప్‌డేట్స్‌ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తాజాగా వారిలో జోష్ నింపేలా నిధి ఓ ఆసక్తికర విషయం పోస్ట్‌ చేశారు. ఒకే రోజు ఈ రెండు సినిమాల షూటింగ్‌లలో పాల్గొన్నట్లు తెలిపారు.