గతంలో బాలయ్య అనేక చిత్రాల షూటింగ్స్ కర్నూలులో జరిగాయి. కొంత గ్యాప్ తర్వాత మళ్ళీ కత్తి పట్టుకొని సీమ సింహంలా గర్జిస్తున్నారు బాలయ్య అని ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు. ఈ సినిమాలో గతంలో వచ్చిన ఫ్యాక్షన్ సినిమాల్లా కాకుండా ‘అఖండ’, ‘క్రాక్’ తరహాలో కొత్త మాస్ సీన్లు ఉంటాయని చెప్తున్నారు.
కొండారెడ్డి బురుజు వద్ద యాక్షన్ సీన్స్ తీయటం మన సినిమా వాళ్లకు ఇష్టం. రీసెంట్ గా సరిలేరు నీకెవ్వరు మహేష్ పై కీ సీన్స్ అక్కడే తీసారు. ఆ తర్వాత రీసెంట్ గా రామ్ ..ది వారియర్ చిత్రంలో సీన్స్ కూడా అక్కడే చిత్రీకరించారు. తాజాగా బాలయ్య కూడా ఇక్కడే యాక్షన్ సీన్స్ లో పాల్గొంటున్నారు. వివరాల్లోకి వెళితే...
నందమూరి బాలకృష్ణ, డైరెక్టర్ గోపీచంద్ కాంబినేషన్ లో ఒక యాక్షన్ ఎంటర్టైనర్ రూపొందుతోంది. ఇంకా పేరు పెట్టని ఈ చిత్రాన్ని #NBK107 అనే వర్కింగ్ టైటిల్ తో వ్యహరిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ కొద్ది రోజులుగా కర్నూలు జిల్లాలో సాగుతుంది. సోమవారం కర్నూలులో నగరానికి గుర్తుగా ఉన్న కొండారెడ్డి బురుజు వద్ద కీలక సన్నివేశాలను షూట్ చేయనున్నారు. అలాగే మౌర్య హోటల్ సెంటర్ లో కూడా సీన్స్ తీస్తారు.
ఈ నేపధ్యంలో బాలయ్య కత్తి పట్టుకొని నిల్చున్న కొత్త ఫోటోని విడుదల చేశారు మేకర్స్. ఈ ఫోటో బాగా వైరల్ అయింది. ఈ సినిమా పూర్తి స్దాయి యాక్షన్ చిత్రం అని చెప్పే ప్రయత్నం చేస్తోంది టీమ్. అందులో భాగంగానే ఇలాంటి యాక్షన్ ఎపిసోడ్స్ కు చెందిన ఫొటోలు వదులుతోంది.
గతంలో బాలయ్య అనేక చిత్రాల షూటింగ్స్ కర్నూలులో జరిగాయి. కొంత గ్యాప్ తర్వాత మళ్ళీ కత్తి పట్టుకొని సీమ సింహంలా గర్జిస్తున్నారు బాలయ్య అని ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు. ఈ సినిమాలో గతంలో వచ్చిన ఫ్యాక్షన్ సినిమాల్లా కాకుండా ‘అఖండ’, ‘క్రాక్’ తరహాలో కొత్త మాస్ సీన్లు ఉంటాయని చెప్తున్నారు. ఈ మూవీలో. బాలయ్య తన వయసుకు తగ్గ రీతిలోనే ఈ సినిమాలో గెటప్ లో కనిపించనున్నారు. ఇప్పటికే ఫస్ట్ లుక్ విడుదలైంది. ‘జై బాలయ్య’ అనే టైటిల్ పరిశీలనలో ఉంది.
శ్రుతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ మూవీలో కన్నడ స్టార్ దునియా విజయ్ విలన్ గా టాలీవుడ్ కి పరిచయం అవుతున్నారు. వరలక్ష్మి శరత్కుమార్ కీలక పాత్ర పోషించనుంది. ఆమె ఇంతకుముందు గోపీచంద్ మలినేని హిట్ సినిమా ‘క్రాక్’లో కూడా నటించారు.
