వరుస సినిమాలు రిలీజవుతున్న వేళ నాగబాబు (Nagababu) ఏపీ ప్రభుత్వానికి సూటిగా ప్రశ్నలు విసిరారు. టికెట్ రేట్లపై ఇంకా స్పష్టత ఇవ్వకపోవడం.. జీవో జారీలో జాప్యంపై మండిపడ్డారు. తెలుగు సినిమాలను బ్యాన్ చేయండి అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
ఏపీ ప్రభుత్వం సినిమా టికెట్ల రేట్లపై ఇంకా జీవోను జారీ చేయకపోవడం పట్ల నటుడు, నిర్మాత నాగబాబు (Nagababu) ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన చిత్రం ‘భీమ్లా నాయక్’ రిలీజ్ అయ్యింది. మంచి హిట్ చిత్రం రన్ అవుతోంది. అయితే పెద్ద, చిన్న సినిమాలు రిలీజ్ అవుతున్నా ఏపీ ప్రభుత్వం ఇంకా ఒక స్పష్టత ఇవ్వకపోవడం సరైన విధానం కాదని నాగబాబు అభిప్రాయపడ్డారు. ఈ మేరకు యూబ్యూబ్ లో ఓ వీడియోను పోస్ట్ చేశారు.
వరుస సినిమాలు రిలీజవుతున్న వేళ నాగబాబు (Nagababu) ఏపీ ప్రభుత్వానికి సూటిగా ప్రశ్నలు విసిరారు. టికెట్ రేట్లపై ఇంకా స్పష్టత ఇవ్వకపోవడం.. జీవో జారీలో జాప్యంపై మండిపడ్డారు. ఈ నెల 17న ఏపీ ప్రభుత్వం టికెట్ల రేట్లపై సమావేశం నిర్ణయించింది. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi), ప్రభాస్ (Prabhas), మహేశ్ బాబు (Mahesh Babu), ఆర్ నారాయణ మూర్తి ఏపీ ప్రభుత్వానికి టికెట్ రేట్స్, వంద శాతం ఆక్యుపెన్సీ, బెనిఫిట్ షోస్ కు పర్మిషన్ ఇవ్వాలని విన్నవించారు. ఈ మేరకు వంద శాతం ఆక్యుపెన్సీని పెంచిన ఏపీ ప్రభుత్వం.. టికెట్ రేట్లపై మాత్రం ఇంకా మౌనం వీడలేదు.
ఇప్పటికే ప్రభుత్వం నుంచి రావాల్సిన జీవో రాకపోవడంతో ఈ మధ్యకాలంలో రిలీజ్ అవుతున్న సినిమాలు కలెక్షన్స్ లేక నష్ట పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇందుకు నాగబాబు స్పందిస్తూ.. ‘త్వరగా జీవో జారీ చేయాలని ఏపీ ప్రభుత్వాన్ని కోరారు. లేదంటే తెలుగు సినిమాలను ఏపీలో బ్యాన్ చేయండి.. సినిమాటోగ్రఫీ మంత్రి నానిని హీరోగా పెట్టి మీరే సినిమాలు తీసుకోండి.. ఇదే పంథాలో వెళితే పెద్ద సినిమాలకు కొంతమేర తట్టుకున్నా చిన్న సినిమాలు మాత్రం పూర్తిగా నష్టపోవాల్సిన పరిస్థితి నెలకొందంటూ’ ఆవేదన వ్యక్తం చేశారు.
https://drive.google.com/file/d/1t22IYvujwGzbnWp3pFTC68_v2gjEYSSe/view?usp=sharing
అయితే సినిమాల కోసం తెలుగు చిత్ర పరిశ్రమలో చాలా మంది త్యాగాలు చేస్తున్నారని తెలిపారు. పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, ప్రభాస్, మహేశ్ బాబు, జూనియర్ ఎన్టీఆర్ తమ రెమ్యూనరేషన్ లో చాలా అడ్జెస్ట్ అవుతున్నారని తెలిపారు. సినిమా వ్యాపారం పెంచేందుకు హీరోల నుంచి పెద్ద ప్రయత్నమే జరుగుతోందని అన్నారు. సినిమా ఇండస్ట్రీని ఒక పరిశ్రమగా కూడా గుర్తించడం లేదంటూ మండిపడ్డారు. అప్పులు తీసుకొచ్చి సినిమాలు తీయాల్సిన పరిస్థితి ఏర్పడిందని వివరించారు. సినీ కార్మికులు రోడ్డున పడుతున్నా పట్టించుకోవడం లేదన్నారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం కొద్దొగొప్పో సహకరిస్తోంది కానీ.. ఏపీ ప్రభుత్వం ఏమాత్రమూ సహకరించడం లేదన్నారు... ఇటు ఫైనాన్షియల్ సపోర్ట్ లేక.. ఇండస్ట్రీ డెవలప్ మెంట్ లేక చాలా ఇబ్బందులు పడుతున్నామని అన్నారు. ఇఫ్పటికైనా రాజకీయనాయకులు సినిమాకు సహకరించాలని కోరారు. తమ సినిమాల ద్వారా ప్రభుత్వానికి ట్యాక్స్ లు కూడా కడుతున్నామని గుర్తుంచుకోవాలన్నారు. త్వరగా సినిమా టికెట్లపై జీవో ఇవ్వాలని, చిన్న సినిమాలకు అండగా ఉండాలని కోరారు. వ్యక్తిగతంగా కక్ష్య పెట్టుకోకూడదని, సినీ రంగాన్ని కాపాడాల్సిన బాధ్యత ఏపీ ప్రభుత్వంపై ఉంటుందన్నారు.