Asianet News TeluguAsianet News Telugu

మెగాస్టార్ చిరంజీవికి కరోనా పాజిటివ్: మొన్ననే కేసీఆర్ తో భేటీ

మెగాస్టార్ చిరంజీవికి కరోనా పాజిటివ్ నిర్దారణ అయింది. తాను హోం క్వారంటైన్ లోకి వెళ్లినట్లు చిరంజీవి చెప్పారు. మొన్ననే ఆయన నాగార్జునతో కలిసి తెలంగాణ సీఎం కేసీఆర్ ను కలిశారు.

Megastar Chiranjeevi tested positive for Coronavirus positive
Author
Hyderabad, First Published Nov 9, 2020, 11:05 AM IST

హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి కోరనా వైరస్ పాజిటివ్ నిర్ధారణ అయింది. చిరంజీవి ఇటీవల సినీ నటుడు నాగార్జునతో కలిసి తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుతో ప్రగతిభవన్ లో భేటీ అయ్యారు. చిరంజీవి, నాగార్జున తెలుగు సినిమాకు సంబంధించిన విషయాలపై మొన్న కేసీఆర్ తో చర్చించారు. బేటీ సమయంలో కేసీఆర్, చిరంజీవి, నాగార్జున మాస్క్ లు కూడా ధరించలేదు.

ఆచార్య సినిమా షూటింగ్ కు ముందు తాను కోవిడ్ పరీక్షలు చేయించుకుున్నానని, ఆ సమయంలో తనకు ఏ విధమైన కరోనా లక్షణాలు కనిపించలేదని ఆయన చెప్పారు. అయినా తనకు కరోనా వైరస్ పాజిటివ్ వచ్చిందని చెప్పారు. తాను హోం క్వారంటైన్ లో ఉన్నట్లు చిరంజీవి తెలిపారు. తనను కలిసిన ఇద్దరు కూడా కరోనా పరీక్షలు చేయించుకోవాలని ఆయన కోరారు. కేసీఆర్ తో చిరంజీవి భేటీ ఇయిన సందర్బంలో ఎంపీ సంతోష్ కుమార్ కూడా ఉన్నారు. 

Megastar Chiranjeevi tested positive for Coronavirus positive

 

ఇదిలావుంటే, తెలంగాణలో కరోనా మహమ్మారి వ్యాప్తి కొనసాగుతూనే వుంది. తాజాగా(శనివారం రాత్రి 8గంటల నుండి ఆదివారం రాత్రి 8గంటల వరకు)రాష్ట్రవ్యాప్తంగా 23,806మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 857 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. 

దీంతో రాష్ట్రంలో మొత్తం టెస్టుల సంఖ్య 46,42,276 కి చేరగా కేసుల సంఖ్య 2,51,188 కి చేరింది. ఇప్పటికే కరోనా బారినపడిన వారిలో 1504 మంది కోలుకున్నారు. దీంతో కరోనా నుండి రికవరీ అయినవారి మొత్తం సంఖ్య 2,30,568కి చేరింది. దీంతో  ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 19,239కి చేరింది. 

 గత 24గంటల్లో రాష్ట్రంలో కరోనాతో నలుగురు మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 1381కి చేరింది. రాష్ట్రంలో కరోనా మరణాల రేటు 0.54శాతంగా వుంటే దేశంలో ఇది 1.5శాతంగా వుంది. రికవరీ రేటు దేశంలో 92.5శాతంగా వుంటే రాష్ట్రంలో మాత్రం 91.79 శాతంగా వుంది. జిల్లాలవారిగా కేసుల సంఖ్యను పరిశీలిస్తే అత్యధికంగా హైదరాబాద్(జిహెచ్ఎంసి)లో 250 కేసులు నమోదయ్యాయి. 

మేడ్చల్ 61, రంగారెడ్డి 88, భద్రాద్రి కొత్తగూడెం 35, కరీంనగర్ 48, ఖమ్మం 25, నల్గొండ 30, వరంగల్ అర్బన్ 38 కేసులు నమోదయ్యాయి. మిగతాజిల్లాలో కేసుల సంఖ్య కాస్త తక్కువగా వున్నాయి. 

Follow Us:
Download App:
  • android
  • ios