బాలీవుడ్ స్టార్ తో మంచు విష్ణు ఫైట్.. 'మోసగాళ్ళు' లేటెస్ట్ అప్డేట్
మంచు విష్ణు ఈ సారి కెరీర్ లో బెస్ట్ హిట్ అందుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నాడు. విష్ణు ప్రస్తుతం హాలీవుడ్ టెక్నీషియన్స్ తో ఒక సినిమా చేస్తున్నాడు. గతంలో ఎప్పుడు లేని భారీ స్థాయిలో ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. సినిమాలో బాలీవుడ్ యాక్టర్స్ కూడా కనిపించనున్నారు
వరుస అపజయాలతో గతకొంత కాలంగా సతమతమవుతున్నకథానాయకుడు మంచు విష్ణు ఈ సారి కెరీర్ లో బెస్ట్ హిట్ అందుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నాడు. విష్ణు ప్రస్తుతం హాలీవుడ్ టెక్నీషియన్స్ తో ఒక సినిమా చేస్తున్నాడు. గతంలో ఎప్పుడు లేని భారీ స్థాయిలో విష్ణు ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. సినిమాలో బాలీవుడ్ యాక్టర్స్ కూడా కనిపించనున్నారు.
విష్ణు మంచు కథానాయకుడిగా నటిస్తూ నిర్మిస్తోన్న ఈ చిత్రానికి ఇటీవల `మోసగాళ్ళు` అనే టైటిల్ ఫిక్స్ చేశారు. జెఫ్రీ గీ చిన్ దర్శకుడు. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా చిత్రీకరణను జరుపుకుంటోంది. బాలీవుడ్ స్టార్ సునీల్ శెట్టి ఈ చిత్రంలో ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. విష్ణు మంచు, సునీల్ శెట్టి మధ్య భారీ యాక్షన్ సీక్వెన్స్ను ఇప్పుడు చిత్రీకరిస్తున్నారు.
హాలీవుడ్ యాక్షన్ నిపుణుల ఆధ్వర్యంలో.. హైదరాబాద్ రామోజీ ఫిలింసిటీలో వేసిన భారీ సెట్లో ఈ యాక్షన్ సీన్ను చిత్రీకరిస్తున్నారు. ప్రేక్షకులను మెప్పించేలా నిపుణుల పర్యవేక్షణలో ఈ యాక్షన్ పార్ట్ను మాస్టర్ పీస్లా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇప్పటి వరకు తెలుగు తెరపై రానటువంటి విధంగా ఈ యాక్షన్ సీన్ ఉండబోతుందని మేకర్స్ అంటున్నారు.
ఈ సన్నివేశం కోసం ఇద్దరు స్టార్స్ ప్రత్యేకమైన శిక్షణను కూడా తీసుకుంటున్నారు. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి ఈ చిత్రాన్ని వేసవిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. నటీనటులు.. విష్ణు మంచు , సునీల్ శెట్టి, కాజల్ అగర్వాల్, నవదీప్, నవీన్ చంద్ర, రూహి సింగ్ తదితరులు