Asianet News TeluguAsianet News Telugu

ఓ పక్క షూటింగ్.. మరోపక్క ట్రైనింగ్.. బిజీబిజీగా లావణ్య!

సందీప్ కిషన్ హీరోగా నటిస్తున్న 'ఏ1 ఎక్స్‌ప్రెస్' హాకీ నేపథ్యంలో రూపొందుతోంది. అందులో లావణ్యా త్రిపాఠి హాకీ క్రీడాకారిణిగా కనిపించనున్నారు. క్యారెక్టర్‌లో పర్‌ఫెక్షన్ కోసం హాకీ కోర్టులో తీవ్రంగా ప్రాక్టీస్ చేస్తున్నట్లు చెప్తోంది. 

Lavanya Tripathi practises hockey early in the morning and flies back to Chennai.
Author
Hyderabad, First Published Feb 19, 2020, 11:30 AM IST

'అందాల రాక్షసి', 'భలే భలే మగాడివోయ్', 'సోగ్గాడే చిన్ని నాయనా', 'శ్రీరస్తు శుభమస్తు', 'అర్జున్ సురవరం' వంటి సక్సెస్ ఫుల్  చిత్రాల్లో కనిపించినా లావణ్యా త్రిపాఠికు చెప్పుకోదగ్గ పేరు రాలేదు. అందంతో పాటు అభినయ ప్రదర్శన ఉన్నా ఆమెకు సరైన పాత్రలు పడటం లేదు. ఫలానా సినిమాలో నటిగా ఆమెకు ప్రత్యేకమైన గుర్తింపు అన్నది లేదు. సినిమాలో ఓ భాగంగా ఆమె కెరీర్ నడిచిపోతోంది. అలాగని ఆఫర్స్ తగ్గటం లేదు. జోరుగా లేకపోయినా ఓ స్దాయిలో సినిమాలో ఉంటున్నాయి.

ప్రస్తుతం లావణ్య త్రిపాఠి తెలుగులో రెండు సినిమాలు చేస్తోంది. అందులో ఒకటి... 'ఏ1 ఎక్స్‌ప్రెస్'. రెండు... 'చావు కబురు చల్లగా...!' వాటిలో 'ఏ1 ఎక్స్‌ప్రెస్' లో  ఓ వైవిధ్యమైన పాత్ర ఆమెను వెతుక్కుంటూ వచ్చిందని చెప్తోంది.  హీరోయిన్ గా లావణ్యా త్రిపాఠి కెరీర్‌లో కొత్త దశ ప్రారంభమైందని మీడియా అంటోంది.

సందీప్ కిషన్ హీరోగా నటిస్తున్న 'ఏ1 ఎక్స్‌ప్రెస్' హాకీ నేపథ్యంలో రూపొందుతోంది. అందులో లావణ్యా త్రిపాఠి హాకీ క్రీడాకారిణిగా కనిపించనున్నారు. క్యారెక్టర్‌లో పర్‌ఫెక్షన్ కోసం హాకీ కోర్టులో తీవ్రంగా ప్రాక్టీస్ చేస్తున్నట్లు చెప్తోంది. వరస షెడ్యూలతో బిజీగా ఉన్నప్పటికీ ఒక్క రోజు కూడా హాకీ శిక్షణకు డుమ్మా కొట్టడం లేదు. అవసరమైతే ఒక్కో రోజు రెండు గంటలు తక్కువ నిద్రపోతున్నారు. రెండే గంటలు నిద్రపోతున్నారు. కానీ, హాకీ ప్రాక్టీస్ మాత్రం మానడం లేదు.

తెలుగు సినిమాలతో పాటు ప్రస్తుతం లావణ్యా త్రిపాఠి ఒక తమిళ సినిమా కూడా చేస్తున్నారు. రోజంతా చెన్నైలో తమిళ సినిమా షూటింగ్ చేసి, నైట్ ఫ్లయిట్ క్యాచ్ చేసి హైదరాబాద్ వస్తున్నారు. ఎర్లీ మార్నింగ్ హాకీ ప్రాక్టీస్ చేసి, మళ్లీ చెన్నై వెళ్లి తమిళ సినిమా షూటింగ్ చేస్తున్నారు. ఒక వారం రోజులు ఈ విధంగా చేశారు. ఇటీవల 'ఏ1 ఎక్స్‌ప్రెస్' లేటెస్ట్ షెడ్యూల్ షూటింగ్ స్టార్ట్ చేశారు. లావణ్య త్రిపాఠి హార్డ్ వర్క్, డెడికేషన్ చూసిన సినిమా యూనిట్ ఆమెను అభినందిస్తున్నారు.

'ఏ1 ఎక్స్‌ప్రెస్'తో  పాటు లావణ్యా త్రిపాఠి నటిస్తున్న మరో తెలుగు సినిమా 'చావు కబురు చల్లగా...!'. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పతాకంపై కార్తికేయ హీరోగా రూపొందుతోంది. గీతా ఆర్ట్స్ సంస్థలో 'భలే భలే మగాడివోయ్', 'శ్రీరస్తు శుభమస్తు' సినిమాల తర్వాత లావణ్యా త్రిపాఠి నటిస్తున్న సినిమా ఇది. డార్క్ కామెడీగా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో ఇప్పటివరకూ చేయనటువంటి పాత్రలో ఆమె కనిపించనున్నట్లు సమాచారం.

Follow Us:
Download App:
  • android
  • ios