Tollywood:షాకింగ్.. ఫ్యాన్స్ షోలు &బెనిఫిట్ షోలు రద్దు,కారణం ఇదీ
ఎగ్జిబిటర్స్ అందరూ కలిసి సమావేశం జరుపుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఓ ప్రకటన రిలీజ్ చేసారు. అయితే పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్బంగా జల్సా చిత్రం రీరిలీజ్ కాబట్టి ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు అంటూ కొందరు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.
ఫ్యాన్స్ షోలు, బెనిఫిట్ షోలు అభిమానులకు ఇచ్చే కిక్కే వేరు. అయితే వారు ఆ అత్యూత్సాహంలో చేసే పనులు ఒక్కోసారి ఇబ్బందులు తెచ్చిపెడతాయి. ఇలాంటిదే ఇప్పుడు తెలుగు పరిశ్రమలో చోటు చేసుకుంది. కాకినాడ ఎగ్జిబిటర్స్ అశోశియోషన్ వారు ఇక నుంచి అన్ని సినిమాల ఫ్యాన్స్ షోలు, బెనిఫిట్ షోలు బ్యాన్ చేస్తున్నారు. ఈ మేరకు నిర్ణయం తీసుకుని ప్రకటన వచ్చింది. అయితే అందుకు కారణం ఏమిటి అంటే...
రీసెంట్ గా కాకినాడలో #Pokiri చిత్రం రీ రిలీజ్ స్క్రీనింగ్ జరిగింది. ఆ సమయంలో ఆ షోలు వేసిన థియేటర్స్ కు చెందిన ప్రోపర్టీ డ్యామేజ్ అయ్యింది. కుర్చిలు , తెర కూడా డ్యామేజ్ కావటం జరిగింది. దాంతో అక్కడ ఎగ్జిబిటర్స్ అందరూ కలిసి సమావేశం జరుపుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఓ ప్రకటన రిలీజ్ చేసారు. అయితే పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్బంగా జల్సా చిత్రం రీరిలీజ్ కాబట్టి ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు అంటూ కొందరు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. ఏది ఏమైనా కొంతకాలం పాటు ఈ బ్యాన్ నడుస్తుందని చెప్తున్నారు. ఏ ఎగ్డిబిటర్ అయినా ఈ నిర్ణయాన్ని అతిక్రమించి షోలు వేయటం జరిగితే వారిపై చర్యలు తీసుకుంటామని, లక్ష రూపాయల ఫైన్ ఉంటుందని చెప్తున్నారు.
స్టార్ హీరోల బర్త్ డే రోజున గతంలో వారు చేసిన బ్లాక్ బస్టర్ సినిమాలను రీరిలీజ్ చేసే ప్లాన్ చేస్తున్నారు. ఇటీవల మహేష్ బాబు బర్త్ డే సందర్భంగా పోకిరి, ఒక్కడు సినిమాలను రీరిలీజ్ చేశారు ఫ్యాన్స్. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే సందర్భంగా అభిమానులు భారీ సన్నాహాలు చేస్తున్నారు. ఆగష్టు 22న మెగాస్టార్ తన 67వ పుట్టినరోజు జరుపుకోనున్నారు. ఈ సందర్భంగా సెలబ్రేషన్స్ అన్ని తారాస్థాయిలో ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది.
మెగాస్టార్ హీరోగా నటించిన బ్లాక్ బస్టర్ ‘ఘరానా మొగుడు’ సినిమాను ఈ నెల 22న మరోసారి థియేటర్లలో రిలీజ్ చేయనున్నారు ఫ్యాన్స్. 30 ఏళ్ళ క్రితం విడుదలైన ఘరానా మొగుడు మూవీని సెలెక్టెడ్ థియేటర్స్లో ప్రదర్శించనున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.