యంగ్ హీరో నితిన్ వరుస చిత్రాలతో దూసుకుపోతున్నాడు. గత ఏడాది నితిన్ కు అంతగా కలసి రాలేదు. విడుదలైన రెండు చిత్రాలు ఛల్ మోహన్ రంగ, శ్రీనివాస కళ్యాణం నిరాశపరిచాయి. ఈ ఏడాది నితిన్ ఏకంగా ముగ్గురు దర్శకులని లైన్ లో పెట్టాడు.
నితిన్ ప్రస్తుతం ఛలో ఫేమ్ వెంకీ కుడుముల దర్శకత్వంలో భీష్మ చిత్రంలో నటిస్తున్నాడు. రష్మిక ఈ చిత్రంలో హీరోయిన్. సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని క్రిస్టమస్ కానుకగా విడుదల చేసేందుకు సన్నాహకాలు చేస్తున్నారు.
మరోవైపు నితిన్ విభిన్న చిత్రాల దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో నటించేందుకు అంగీకరించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా ప్రకాష్ వారియర్, సిమ్రాన్ చౌదరి హీరోయిన్లుగా నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. తాజాగా ఈ చిత్ర టైటిల్ గురించి ఆసక్తికర ప్రచారం జరుగుతోంది.
ఈ చిత్రానికి దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి 'చదరంగం' అనే టైటిల్ పరిశీలిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ చిత్ర కథ చదరంగం ఆట నేపథ్యంలో ఉండబోతున్నట్లు తెలుస్తోంది. కీరవాణి ఈ చిత్రానికి సంగీత దర్శకుడు. ఈ క్రేజీ ప్రాజెక్ట్ సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో తెలియనున్నాయి.
ఇదిలా ఉండగా నితిన్ తొలిప్రేమ ఫేమ్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో కూడా నటించబోతున్నాడు. ఈ చిత్ర టైటిల్ రంగ్ దే. జాతీయ అవార్డు విజేత కీర్తి సురేష్ ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించనుంది.
Read Exclusive COVID-19 Coronavirus News updates, from Telangana, India and World at Asianet News Telugu.
వర్చువల్ బోట్ రేసింగ్ గేమ్ ఆడండి మిమ్మల్ని మీరు ఛాలెంజ్ చేసుకోండి ఇప్పుడే ఆడటానికి క్లిక్ చేయండి
Last Updated Oct 5, 2019, 11:18 AM IST