అఖిల్ ‘ఏజెంట్’పై ఇంట్రెస్టింగ్ బజ్.. అదిరిపోయే ట్విస్ట్ ప్లాన్ చేస్తున్న సురేందర్ రెడ్డి..
‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’తో సాలిడ్ హిట్ అందుకున్న అక్కినేని యంగ్ హీరో అఖిల్ అదే జోష్ తో దూసుకెళ్తున్నాడు. ప్రస్తుతం ‘ఏజెంట్’తో మరో హిట్ కోసం ఆడియెన్స్ ముందుకు రాబోతున్నాడు. ఈ క్రమంలో మూవీ నుంచి క్రేజీ బజ్ వినిపిస్తోంది.
అక్కినేని యంగ్ హీరో అఖిల్ (Akhil) ఇప్పటికే ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ సినిమాతో అలరించిన విషయం తెలిసిందే. లాంచ్ అయిన తర్వాత వరుస ఫ్లాపులతో ఇబ్బంది పడుతున్న అఖిల్కు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్ సినిమాతో కొత్త ఎనర్జీ వచ్చింది. ప్రస్తుతం మరో ఫస్ట్ కమర్షియల్ హిట్టు కోసం తయారవుతున్నాడు. అదే జోష్ లో ‘ఏజెంట్’ సినిమాతో ఆడియెన్స్ ముందుకు వస్తున్నాడు.
బ్లాక్బస్టర్ హిట్టు కొట్టాలని చూస్తున్న అఖిల్ పక్కా మాస్ సినిమా కోసం సురేందర్ రెడ్డితో చేతులు కలిపిన విషయం తెలిసిందే. ‘కిక్, రేసు గుర్రం, కిక్ 2, ధ్రువ, సైరా నర్సింహా రెడ్డి’ చిత్రాలతో తన మార్క్ చూపించారు సురేందర్ రెడ్డి. ఇక అక్కినేని యంగ్ హీరోను మాస్ గా లాంచ్ చేసేందుకు Agentను తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. ఇప్పటికే మూవీ నుంచి వచ్చి పోస్టర్స్, అప్డేట్స్ సినిమాపై హైప్ ను పెంచుతున్నాయి. మరోవైపు ఈ మూవీ కోసం అఖిల్ తన మేక్ ఓవర్ ను పూర్తిగా మార్చేశాడు. ఫిజికల్ ఫిట్ నెస్ తో బిగ్ స్క్రీన్ పై మ్యాజిక్ చేయనున్నాడు.
ఇదిలా ఉంటే తాజాగా మూవీ నుంచి క్రేజీ న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. కథలో బలం, హీరోయిజం పక్కాగా చూపించే సురేందర్ రెడ్డి, ఇంటర్వెల్ బ్యాంగ్స్ ను కూడా అదిరిపోయేలా ప్లాన్ చేస్తాడన్న విషయం తెలిసిందే. అయితే అఖిల్ కోసం ‘ఏజెంట్’లోనూ అదిరిపోయే ట్విస్ట్ ను ప్లాన్ చేశాడని టాక్ వినిపిస్తోంది. ఈ ట్విస్ట్ కూడా ఇంటర్వెల్ కు ముందు ఉంటుందని, ఇక్కడి నుంచి సినిమా మొత్తం హైప్ కు వెళ్తుందని సమాచారం. మమ్ముట్టీ - అఖిల్ మధ్య సాగే సన్నివేశాలుగా తెలుస్తోంది. ఈ క్రేజీ బజ్ తో ప్రేక్షకుల్లో సినిమాపై మరింతగా అంచనాలు పెరిగాయి.
ఆగస్టు 12న అఖిల్ ‘ఏజెంట్’ను రిలీజ్ చేయాలని ప్లాన్ చేసినా.. వాయిదా వేస్తూ దసరా బరిలోకి దిగుతున్నట్టు తెలుస్తోంది. అలాగే పాన్ ఇండియన్ మూవీగా సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్లాన్ లో ఉన్నట్టు సమాచారం. ఇప్పటికే మూవీ నుంచి వచ్చిన ఫస్ట్ లుక్ పోస్టర్ కు ఆడియెన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. సాక్షి వైద్య (Sakshi Vaidya) హీరోయిన్ గా నటిస్తున్నారు. మలయాళ స్టార్ మమ్ముట్టీ కీలకపాత్రలో కనిపించనున్నారు. ఏకే ఎంటర్టైనమెంట్స్ బ్యానర్లో సురేందర్ రెడ్డి స్వీయ నిర్మాణం తెరకెక్కుతోంది. ప్రస్తుతం హైదరాబాద్ లో అఖిల్ తో భారీ యాక్షన్ సీక్వెన్స్ ను తెరకెక్కిస్తున్నారు.