జనతా కర్ఫ్యూ.. ప్రజల స్పందనతో కన్నీరు పెట్టుకున్న హీరోయిన్!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ ప్రజల స్పందనతో భావోద్వేగానికి లోనయ్యారు. దేశమంత ఒక్కతాటి మీదకు వచ్చిన సంఘీభావం తెలపటంతో ఆమె ఉద్వేగానికి లోనయ్యారు. తన కిటికీ నుంచి చూస్తూ చప్పట్లు కొడుతున్న ప్రగ్యా వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
కరోనా ప్రపంచ వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. దేశమంతా ప్రజలు ఇంటికే పరిమిత మవుతున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ విషయంలో చాలా సీరియస్గా చర్యలు చేపడుతున్నారు. ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీ ఒక రోజు పాటు జనతా కర్ఫ్యూ పాటించాలంటూ కోరారు. ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి కూడా విశేష స్పందన వచ్చింది. ఈ నేపథ్యంలో ప్రతీ ఒక్కరు స్వీయ నియంత్ర పాటిస్తూ ఇంటికే పరిమితమయ్యారు.
అంతేకాదు తమ కోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా నిరతరం శ్రమిస్తున్నడాక్టర్లు, మున్సిపాలిటీ కార్మికులు, పోలీసులకు కృతజ్ఞతలు తెలిపాలని ప్రధాని కోరారు. వారికి సంఘీభావంగా సాయంత్ర 5 గంటలకు ప్రజలు తమ బాల్కనీలలోకి వచ్చి చప్పట్లు కొడుతూ వారికి కృతజ్ఞతలు తెలపాలని కోరారు. ఈ కార్యక్రమానికి కూడా ప్రజల నుంచి విశేష స్పందన వచ్చింది. కష్టకాలంలో తమకు రక్షణగా నిలిచి వారికి మద్దతు తెలిపేందుకు ప్రజలు పెద్ద ఎత్తున ముందుకు వచ్చారు. దాదాపు దేశంలోని ప్రతీ ఒక్కరు తమకు నచ్చిన రీతిలో చప్పుడు చేస్తూ సంఘీభావం తెలిపారు.
ఈ కార్యక్రమంలో సెలబ్రిటీలు కూడా తమ అభిమానులకు ఆదర్శంగా నిలిచారు. దాదాపు సినీ రాజకీయా ప్రముఖుల అంతా చప్పట్లు కొడుతూ గంటలు మోగిస్తూ తమ వంతుగా మద్దతు పలికారు. ఈ నేపథ్యంలో ప్రగ్యా జైస్వాల్ ఎమోషనల్ అయ్యింది. తన ఇంటి కిటికీ నుంచి రియల్ హీరోస్కు మద్దతుగా చప్పట్లు కొడుతూ ప్రజల నుంచి వచ్చిన స్పందనతో కన్నీరు పెట్టుకుంది. దేశమంతా ఒక్కతాటిమీదకు రావటంపై హర్షం వ్యక్తం చేస్తూ ఆనంద బాష్పాలు పెట్టుకుంది. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న ప్రగ్యా, సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గానే ఉంటుంది.