Asianet News TeluguAsianet News Telugu

పిక్ టాక్: మరో బోల్డ్ ఫోజుతో రెచ్చిపోయిన పూరి హీరోయిన్

సోషల్ మీడియాలో హీరోయిన్ దిశా పటాని జోరు మాములుగా లేదు. క్రమంగా దిశా పటానికి హీరోయిన్ గా కంటే సోషల్ మీడియాలోనే ఎక్కువ గుర్తింపు లభిస్తోంది. అందుకు కారణం దిశా బోల్డ్ ఫోజులతో ఇన్స్టాగ్రామ్ లో హాట్ టాపిక్ గా మారుతోంది.

Disha Patani latest pic sets fire in internet
Author
Hyderabad, First Published Dec 9, 2019, 7:25 PM IST

సోషల్ మీడియాలో హీరోయిన్ దిశా పటాని జోరు మాములుగా లేదు. క్రమంగా దిశా పటానికి హీరోయిన్ గా కంటే సోషల్ మీడియాలోనే ఎక్కువ గుర్తింపు లభిస్తోంది. అందుకు కారణం దిశా బోల్డ్ ఫోజులతో ఇన్స్టాగ్రామ్ లో హాట్ టాపిక్ గా మారుతోంది. దిశా పటాని లోఫర్ చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. 

పూరి జగన్నాధ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ లో దిశా గ్లామర్ మెరుపులు మెరిపించింది. సినిమా ఫ్లాఫ్ అయినప్పటికీ దిశాకు టాలీవుడ్ లో మంచి ఆఫర్స్ వస్తాయని అంతా భావించారు. కానీ దిశా పటాని బాలీవుడ్ కు వెళ్ళిపోయింది. బాలీవుడ్ కు వెళ్లినా దిశాకు పెద్దగా కలసి రాలేదు. ఆరంభంలో కొన్ని చిత్రాలలో అవకాశం వచ్చింది. ఆ తర్వాత దర్శక నిర్మాతలు దిశాని పట్టించుకోవడం మానేశారు. 

అప్పుడప్పుడు కొన్ని చిత్రాలలో నటిస్తూ కెరీర్ సాగిస్తోంది. ఇక కార్పొరేట్ ఎండార్స్మెంట్ లో దిశా బిజీగా గడుపుతోంది. పలు బ్రాండ్స్ కు ప్రచారం కల్పిస్తోంది. తాజాగా ఓ ఇన్నర్ వేర్ బ్రాండ్ ప్రచారం కల్పించే క్రమంలో దిశా పాటని ఇంస్టాగ్రామ్లో ఓ బోల్డ్ ఫోజుతో ఉండే ఫోటోని పోస్ట్ చేసింది. 

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

💚🧚‍♀️ #MyCalvins @calvinklein

A post shared by disha patani (paatni) (@dishapatani) on Dec 9, 2019 at 5:11am PST

దిశా పటాని తన అందాలు ఆరబోస్తూ వయ్యారంగా ఇచ్చిన ఈ ఫోజు యువత హృదయాల్లో సెగలు పెట్టించే విధంగా ఉంది. ప్రస్తుతం ఈ పిక్ సామజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఇలా గ్లామర్ ఫోజులతో ఫోటో షూట్స్ చేయడం దిశాకు కొత్తేమి కాదు.  

Follow Us:
Download App:
  • android
  • ios