Asianet News TeluguAsianet News Telugu

కరోనా ఎఫెక్ట్: బడ్జెట్ సమస్యలో పడ్డ నాగ్ 'వైల్డ్ డాగ్'

సినిమా షూటింగ్ సవ్యంగా జరిగి, రిలీజ్ అనుకున్న టైమ్ లో అయితే ఆ సినిమా నిర్మాత అంత అదృష్టవంతుడు మరొకరు ఉండరు. ఏ కారణం చేత అయినా పోస్ట్ ఫోన్ అయితే రకరకాల సమస్యలు వస్తాయి. ముఖ్యంగా ఆర్టిస్ట్ లు డేట్స్ సమస్య, అదే విధంగా బడ్జెట్ కంట్రోలు తప్పటం జరుగుతుంది. ఇప్పుడు నాగ్ తాజా చిత్రానికి అలాంటి సమస్యే వేధిస్తోందని సమాచారం. 

Corona Effect: Nag producer lands in budget trouble
Author
Hyderabad, First Published Feb 12, 2020, 8:58 PM IST

సినిమా షూటింగ్ సవ్యంగా జరిగి, రిలీజ్ అనుకున్న టైమ్ లో అయితే ఆ సినిమా నిర్మాత అంత అదృష్టవంతుడు మరొకరు ఉండరు. ఏ కారణం చేత అయినా పోస్ట్ ఫోన్ అయితే రకరకాల సమస్యలు వస్తాయి. ముఖ్యంగా ఆర్టిస్ట్ లు డేట్స్ సమస్య, అదే విధంగా బడ్జెట్ కంట్రోలు తప్పటం జరుగుతుంది. ఇప్పుడు నాగ్ తాజా చిత్రానికి అలాంటి సమస్యే వేధిస్తోందని సమాచారం. కరోనా వైరస్ భయంతో నాగ్ తాజా చిత్రం  వైల్డ్ డాగ్ షూటింగ్ ని వాయిదా వేసారు. దాంతో తక్కువ బడ్జెట్ లో  పూర్తవుతుందనుకున్న సినిమా గీత దాటుతోందని నిర్మాతలు టెన్షన్ పడుతున్నట్లు ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం.

మొదట ఈ చిత్రం నిర్మాతలు సినిమాని నాన్ స్టాప్ గా షూట్ చేసి కంప్లీట్ చేయాలనుకున్నారు. దాంతో బడ్జెట్ తమ కంట్రోలు ఉంటుందని భావించారు. అయితే ఇప్పుడా ప్లాన్ మారింది. ధాయిల్యాండ్ షెడ్యూల్ పోస్ట్ ఫోన్ అయ్యింది. టిక్కెట్లు అన్నీ కాన్సిల్ చేసుకున్నారు. డేట్స్ చాలా మందివి తారుమారు అయ్యాయి. వీటితో సినిమాకు మొదట అనుకున్న బడ్జెట్ లో పూర్తి చేయటం అసాధ్యం అని తేల్చారట. ఊహించని ఈ ట్విస్ట్ కు నిర్మాత ఎలా దీన్ని అథిగమించాలా అని టెన్షన్ పడుతున్నారుట.

కరోనా వైరస్ కనుక కంట్రోలులోకి వస్తే వారం దాటాక ధాయిల్యాండ్ వెళ్లి షూట్ చేద్దామనుకుంటున్నారట. అది కనుక జరగకపోతే ఇక్కడే ఆ లొకేషన్స్ ని రీక్రియేట్ చేయాలని భావిస్తున్నారుట. ఒరిజనల్ లొకేషన్స్ ని రీక్రియేట్ చేయటం అంటే మాటలు కాదు. అలాగని వేరే దేశం వెళితే ధాయిల్యాండ్ లో అనుకున్న బడ్జెట్ కు రెండు మూడు రెట్లు పెరుగుతుంది. నాగార్జున మాత్రం వేరే ఏదన్నా యూరోపియన్ దేశం వెళ్లి షూట్ పూర్తి చేసుకుని వద్దామని అంటున్నారట. ఎందుకంటే ఆయనకు ఈ షెడ్యూల్ లో పూర్తి కాకపోతే వేరే సినిమా ప్రారంభం లేటవుతుంది.
 
ఇక ఈ సినిమాలో నాగార్జున ఎన్‌ఐఏ అధికారి విజయ్‌ వర్మగా కనిపించనున్నారు. `గగనం` తర్వాత నాగార్జున ఈ తరహా పాత్రలో కనిపించనుండటంతో ఫ్యాన్స్ ఈ సినిమాపై అంచనాలే పెట్టుకున్నారు. కొన్ని యదార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమా రూపొందుతోందని చెప్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా మొదటి షెడ్యూల్ షూటింగ్ పూర్తయింది. ఈ సినిమాను మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై నిరంజన్‌ రెడ్డి, అన్వేష్‌ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios