Asianet News TeluguAsianet News Telugu

కూల్ డ్రింకులో మత్తు మందు కలిపి సినీ నటిపై అత్యాచారం

తనపై ఓ కంపెనీ సీఈవో అత్యాచారం చేశాడని ఓ సినీ నటి పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనపై అత్యాచారం చేసిన దృశ్యాలను మొబైల్ ద్వారా చిత్రీకరించి, తనను బ్లాక్ మెయిల్ చేశాడని బెంగళూరుకు చెందిన సినీ నటి ఆరోపించింది.

Cine actress molested and cheated in Bengaluru of Karnataka
Author
Bengaluru, First Published Jul 5, 2020, 8:47 AM IST

బెంగళూరు: ఓ ప్రముఖ సినీ నటిపై అత్యాచారం జరిగింది. మోసానికి కూడా గురైంది. ఈ సంఘటనపై సినీ నటి నేరుగా బెంగళూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 30 ఏళ్ల సినీనటిపై ఓ ప్రైవేట్ కంపెనీ సీఈవో అత్యాచారానికి పాల్పడి, ఆ తర్వాత పరారయ్యాడు. 

బాధిత సినీ నటి బెంగుళూరులోని జేజే నగర పరిధిలోని ఓ బహుళ అంతస్థుల భవనంలో ఉంటున్నారు. ఇప్పటికే ఆమె పలు కన్నడ, తమిళ సినిమాల్లో నటించారు. 2018లో బసవగుడి పరిధిలోని గాంధీ బజార్ లోని మోహిత్ అనే వ్యక్తి ఆమెకు పరిచయమయ్యాడు. తాను ఓ కంపెనీకి సీఈవోగా పనిచేస్తున్నట్లు చెబుకుని ఆమెకు దగ్గరయ్యాడు. 

బాధిత మహిళ చేసిన ఫిర్యాదు మేరకు..... కొన్నాళ్ల తర్వాత ఆమెను తన కంపెనీ బ్రాండ్ అంబాసిడర్ గా వేసుకున్నాడు. ఆ తర్వాత గోవా తదితర ప్రాంతాల్లో పర్యటించారు. ఆ తర్వాత సంస్థ ఆర్థిక చిక్కుల్లో పడిందని ఆమె నుంచి డబ్బులు తీసుకున్నాడు. 

2019 జూన్ 22వ తేదీన తన పుట్టినరోజు పార్టీకి ఆమెను ఆహ్వానించాడు. ఆ మర్నాడు ఆమె పుట్టిన రోజు కావడంతో ఇద్దరు కూడా పార్టీ చేసుకున్నారు. ఆ సమయంలో కూల్ డ్రింకులో మత్తు మందు కలిపి ఇచ్చాడని ఆమె ఆరోపించారు. తాను మత్తులోకి వెళ్లిపోయిన తర్వాత తనపై అఘాయిత్యం చేశాడని, దాన్ని తన మొబైల్ లో చిత్రీకరించి తనను మోసం చేశాడని ఆమె ఆరోపించారు. 

ఆ ఫొటోలను చూపించి, తనను బ్లాక్ మెయిల్ చేస్తూ డబ్బులు లాగాడని, మొత్తం రూ.20 లక్షల దాకా తన నుంచి డబ్బు తీసుకున్నాడని ఆమె చెప్పారు. ఈ కేసులో మోహిత్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios