సారాంశం
బాలీవుడ్ హీరో రణ్ బీర్ కపూర్, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా, సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్లో ఈ మూవీ తెరకెక్కింది.
ట్రైలర్ చూసి కథ ఊహించేస్తున్నారు సోషల్ మీడియా జనం. తనకున్న సినీ పరిజ్ఞానంతో సినిమాపై డిస్కషన్స్ మొదలెడుతున్నారు. అదే క్రమంలో ఇప్పుడు సందీప్ రెడ్డి వంగా తాజా చిత్రం యానిమల్ తో పాత చిరంజీవి సినిమాను గుర్తు చేస్తూ వీడియోలు, పోస్ట్ లు పెడుతున్నారు.ఆ సినిమా మరేదో కాదు కిరాతకుడు. ‘కబీర్ సింగ్’ తర్వాత బాలీవుడ్లో సందీప్ రెడ్డి తెరకెక్కించిన చిత్రమిదే. డిసెంబర్ 1న ప్రపంచవ్యాప్తంగా ఇది విడుదల కానుంది. అనిల్ కపూర్, బాబీ డియోల్, శక్తికపూర్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఇప్పటివరకూ విడుదలైన గ్లింప్స్, ట్రైలర్ చూస్తే.. మునుపెన్నడూ చూడని విధంగా ఇందులో రణ్బీర్ పాత్ర ఉండనుందని తెలుస్తోంది. మరోవైపు, సినిమా రిలీజ్ దగ్గరవుతోన్న నేపథ్యంలో చిత్రబృందం ప్రమోషన్స్ వేగవంతం చేసింది. అదే సమయంలో ఈ సినిమాపై వార్తలు మొదలయ్యాయి.
తండ్రికొడుకు బంధంతో తెరకెక్కింది యానిమల్ సినిమా. రణ్బీర్కు తండ్రిగా అనిల్ కపూర్ నటిస్తున్న సంగతి తెలిసిందే. దీంట్లో వీళ్లిద్దరి మధ్య ఉన్న భావోద్వేగభరితమైన అనుబంధాన్ని చూపించనున్నారు.యాక్షన్తో పాటు ఎమోషన్స్ నిండిన ఆసక్తికర కథాంశంతో ఈ చిత్రం రూపొందింది. ట్రైలర్ లో చూపిన దాని ప్రకారం తండ్రి కొడుకును ఎలా చూడాలనుకుంటాడో, అందుకు విరుద్ధంగా కొడుకు పెరుగుతాడు. దీంతో ఒక దశలో "క్రిమినల్ ను కన్నాం మనం" అంటాడు తండ్రి. అయితే కొడుక్కి మాత్రం తండ్రి అంటే విపరీతమైన ప్రేమ. దాంతో తన తండ్రి కోసం ఆ కొడుకు ఏం చేశాడు, ఏం చేయాల్సి వచ్చింది. అందుకు ఎందుకు అంత ఎంత వయొలెంట్ గా మారాడనేది యానిమల్ సినిమా.
ఇక అసలు మేటర్ కు వస్తే...చిరంజీవి హీరోగా నటించిన కిరాతకుడు సినిమా లైన్ కూడా కొంచెం అటూ ఇటూలో ఉంటుంది. పెద్ద స్దాయిలో ఉన్న తండ్రి, కొడుకు ప్రక్క దారి పడతాడు. చివరికి తనని ద్వేషించే తండ్రిని ఓ సిట్యువేషన్ లో రక్షించుకొని, తనకు తండ్రిపై ఉన్న ప్రేమను తెలియజేస్తాడు. ఇదంతా గుర్తు పెట్టుకున్న కొందరు మెగాభిమానులు...ఇప్పటికే రిలీజైన యానిమల్ ట్రయిలర్ లో రణబీర్ కపూర్ షాట్స్, కిరాతకుడులో చిరంజీవి షాట్స్ ను కలిపి వదులుతున్నారు. తండ్రి ఆశయాలకు విరుద్ధంగా కొడుకు ఎదిగి, అదే తండ్రికి సాయంగా నిలబడటం అనే పాయింట్ తో సినిమాని పోలుస్తున్నారు.
ఇక బాలీవుడ్ హీరో రణ్ బీర్ కపూర్, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా, సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్లో ఈ మూవీ తెరకెక్కింది. తాజాగా హైదరాబాద్ లో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ సూపర్ సక్సెస్ కావడంతో.. యానిమల్ పై హైప్ ఉంది. ఈ ఈవెంట్ కు సూపర్ స్టార్ మహేశ్ బాబు, రాజమౌళి సెంట్రాఫ్ అట్రాక్షన్ గా నిలిచారు.