Asianet News TeluguAsianet News Telugu

డైరెక్టర్‌ నిర్ణయంతో కన్‌ఫ్యూజన్‌లో పడ్డ రామ్ చరణ్‌!

కొరటాల భలే షాక్‌ ఇచ్చారు. అల్లు అర్జున్‌తో నెక్ట్స్ ప్రాజెక్ట్న్ ని ప్రకటించి తనపై ఆశలు పెట్టుకోవద్దనే విషయాన్ని పరోక్షంగా చెప్పేశాడు. దీంతో ఇప్పుడు చరణ్‌ కన్‌ఫ్యూజన్‌లో పడ్డారు. తదుపరి సినిమా ఎవరితో చేయాలనేది అర్థం కాని పరిస్థితుల్లోకి వెళ్లారు. 

Cherry was confused on next project
Author
Hyderabad, First Published Aug 1, 2020, 12:55 PM IST

రామ్‌ చరణ్‌.. `మగధీర` తర్వాత రాజమౌళి దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న భారీ మల్టీస్టారర్‌ `ఆర్‌ ఆర్‌ ఆర్‌`లో నటిస్తున్నారు. ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ హీరోగా రూపొందుతున్న ఈ సినిమా దాదాపు డెబ్బై శాతం చిత్రీకరణ పూర్తి చేసుకుంది. మహమ్మారి దెబ్బకి ఇంకా షూటింగ్ తిరిగి‌ ప్రారంభం కాలేదు. ప్రభుత్వం అనుమతి ఇచ్చిన తర్వాత చిత్రీకరణ మొదలు పెట్టాలనుకున్నారు. కానీ అటు ఎన్టీఆర్‌, ఇటు చెర్రీ ససేమిరా అనడంతో వెనక్కి తగ్గారు. 

ఈ గ్యాప్‌లో చెర్రీ నెక్ట్స్ సినిమాలపై ఫోకస్‌ పెట్టినట్టు వార్తలొచ్చాయి. ఎందుకంటే సహ నటుడు ఎన్టీఆర్‌ `ఆర్‌ ఆర్‌ ఆర్‌` తర్వాత త్రివిక్రమ్‌తో సినిమా కన్ఫమ్‌ చేశాడు. అధికారిక ప్రకటన కూడా వచ్చింది. దీంతోపాటు యంగ్‌ టైగర్‌ మరికొన్నింటికి చర్చలు జరుపుతున్నారు. కానీ తన ప్రాజెక్ట్ లు ఇంకా సెట్‌ కాలేదని చెర్రీ మదన పడుతున్నారట. దీంతో స్పీడ్‌ పెంచాలని నిర్ణయించుకున్నారు‌. కొందరు దర్శకులతో చర్చలు జరిపారు.

అందులో ప్రధానంగా కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా దాదాపు ఓకే అయ్యిందని, ప్రస్తుతం మెగాస్టార్‌ చిరంజీవితో చేస్తున్న `ఆచార్య` తర్వాత తన సినిమా ఉంటుందనే వార్త సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. దీనికితోడు అంతకు ముందే పలు వేదికల్లో అటు చిరంజీవి, ఇటు కొరటాల సైతం చెర్రీతో సినిమా గురించి హింట్‌ ఇచ్చారు. దీంతో కొరటాల, చెర్రీ సినిమా దాదాపు కన్ఫామ్‌ అని అంతా అనుకున్నారు. 

బట్‌ కొరటాల భలే షాక్‌ ఇచ్చారు. అల్లు అర్జున్‌తో నెక్ట్స్ ప్రాజెక్ట్న్ ని ప్రకటించి తనపై ఆశలు పెట్టుకోవద్దనే విషయాన్ని పరోక్షంగా చెప్పేశాడు. దీంతో ఇప్పుడు చరణ్‌ కన్‌ఫ్యూజన్‌లో పడ్డారు. తదుపరి సినిమా ఎవరితో చేయాలనేది అర్థం కాని పరిస్థితుల్లోకి వెళ్లారు. నిజానికి చెర్రీ వద్దకు చాలా ప్రాజెక్ట్ లే వచ్చాయి. మహేష్‌ తిరస్కరించడంతో వంశీపైడిపల్లి.. చరణ్‌ని సంప్రదించారు. ఇది కూడా దాదాపు ఓకే అనుకున్నారు.

ఆ తర్వాత `భీష్మ`తో హిట్‌ అందుకున్న వెంకీ కుడుముల దర్శకత్వంలోనూ ఓ సినిమాకి చర్చ జరుగుతున్నట్టు తెలిసింది. మరోవైపు తనకి `ధృవ` లాంటి బ్లాక్‌ బస్టర్‌ని, తన తండ్రి, మెగాస్టార్‌ డ్రీమ్‌ ప్రాజెక్ట్ `సైరా నరసింహారెడ్డి`ని చేసిన సురేందర్‌రెడ్డితోనూ ఓ సినిమా చేసే ఉద్దేశంలో ఉన్నట్టు తెలిసింది. `సైరా.. ` తర్వాత సురేందర్‌రెడ్డికి ఇంకా సినిమా కన్ఫమ్‌ కాలేదు. అఖిల్‌తో ఆ ప్రాజెక్ట్ కి డిస్కషన్‌ జరిగిందన్నారు. బట్‌ అందులోనూ క్లారిటీ లేదు. ఈ నేపథ్యంలో చెర్రీతో ఉండే ఛాన్స్ ఉందన్నారు. 

ఇలా వంశీపైడిపల్లి, వెంకీ కుడుముల, సురేందర్‌ రెడ్డి ముగ్గురిలో ఎవరితో చేయాలన్న విషయంలో చరణ్‌ కన్‌ఫ్యూజన్‌కి గురువుతున్నాడట. అంతా వంశీ పైడిపల్లితోనే ఉంటుందని అంటున్నారు. మరి ఇందులో నిజమెంతా అనేది చూడాలి. ఇందులో విశేషం ఏంటంటే ఇప్పుడు కొరటాల దర్శకత్వంలో రూపొందుతున్న `ఆచార్య`లో చెర్రీ కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. ఆ సినిమా షూటింగ్ సమయంలో చెర్రీ, కొరటాల కాంబినేషన్‌పై చర్చ జరిగిందన్న టాక్ వినిపిస్తోంది.

Follow Us:
Download App:
  • android
  • ios