శిల్పాశెట్టిపై చీటింగ్ కేసు.. భర్తతో కలిసి మోసం చేసిందంటూ!
2014లో శిల్పాశెట్టి, ఆమె భర్త రాజ్ కుంద్రాలకు చెందిన సత్యయుగ్ గోల్డ్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపనీ ఐదేళ్లకు సంబంధించి ఓ గోల్డ్ స్కీమ్ ని ప్రకటించిందని... దానిలో భాగంగా రూ.18 లక్షలు చెల్లించి తాను కూడా కిలో బంగారం కొనుగోలు చేశాడని సచిన్ జోషి అనే ఎన్నారై తెలిపారు
బాలీవుడ్ నటి శిల్పాశెట్టి తన భర్తతో కలిసి మోసం చేసిందంటూ ఓ వ్యక్తి ముంబై పోలీసులను ఆశ్రయించాడు. వివరాల్లోకి వెళితే.. 2014లో శిల్పాశెట్టి, ఆమె భర్త రాజ్ కుంద్రాలకు చెందిన సత్యయుగ్ గోల్డ్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపనీ ఐదేళ్లకు సంబంధించి ఓ గోల్డ్ స్కీమ్ ని ప్రకటించిందని... దానిలో భాగంగా రూ.18 లక్షలు చెల్లించి తాను కూడా కిలో బంగారం కొనుగోలు చేశాడని సచిన్ జోషి అనే ఎన్నారై తెలిపారు.
దీనికి ఆధారంగా తనకొక గోల్డ్ కార్డ్ కూడా ఇచ్చినట్లు అతడు తెలిపాడు. అయితే ఐదేళ్లు గడిచినా.. శిల్పాశెట్టి, రాజ్ కుంద్రాలు తనకు బంగారం ఇవ్వలేదని పోలీసులకు ఫిర్యాదు చేశాడు సదరు వ్యక్తి.
ఈ వయసులోనూ హీట్ పెంచేస్తోన్న పవన్ బ్యూటీ!
దానికి తోడు సచిన్ జోషి టర్మ్ ప్లాన్ 2019 మార్చ్ 25న పూర్తికాగా.. గోల్డ్ స్కీమ్ ప్రకారం తాను ఇన్వెస్ట్ చేసిన డబ్బులకు బంగారం తీసుకోవడానికి వారి ఆఫీస్ కి వెళ్లానని.. కానీ అప్పటికే కంపనీ మూసేశారని చెప్పారు. ఆ తరువాత ఈ విషయం గురించి శిల్పాశెట్టి, రాజ్ కుంద్రాలను సంప్రదించగా.. తామిద్దరం ఆ కంపనీకి రాజీనామా చేశామని అన్నారని తెలిపారు.
ఈ నేపధ్యంలో తాను మోసపోయానని గ్రహించిన సచిన్ జోషి తాజాగా పోలీసులను సంప్రదించారు. అయితే ఇప్పటివరకు ఈ కేసుకి సంబంధించిన కేవలం ఒక్క కంప్లైంట్ మాత్రమే వచ్చిందని.. ఇంకా కేసు నమోదు చేయలేదని పోలీసులు తెలిపారు. మరి ఈ విషయంపై శిల్పాశెట్టి స్పందిస్తుందేమో చూడాలి!