Bigg Boss 3: శ్రీముఖి నోరేసుకొని పడిపోతుంది.. మారుతి కామెంట్స్!
ఆదివారం నాడు గ్రాండ్ ఫినాలే అంతే గ్రాండ్ గా మొదలైంది. భారీ స్థాయిలో భారీ ఏర్పాట్లతో షోని మొదలుపెట్టారు.
బిగ్ బాస్ సీజన్ 3 చివరి దశకి చేరుకుంది. టైటిల్ విన్నర్ ఎవరనే విషయం మరికాసేపట్లో తెలియనుంది. ఇప్పటికే సోషల్ మీడియాలో రాహుల్ సిప్లిగంజ్ విన్నర్ అంటూ ప్రచారం జరుగుతోంది. ఆదివారం నాడు గ్రాండ్ ఫినాలే అంతే గ్రాండ్ గా మొదలైంది. భారీ స్థాయిలో భారీ ఏర్పాట్లతో షోని మొదలుపెట్టారు.
ముందుగా ఎలిమినేట్ అయిన కంటెస్టంట్స్అందరూ తమ డాన్స్ పెర్ఫార్మన్స్ తో షోని మొదలుపెట్టారు. హోస్ట్ నాగార్జున కూడా వారితో కలిసి చిందులేశారు. అనంతరం ఎలిమినేటెడ్ కంటెస్టంట్స్ తో టాప్ 5 కంటెస్టెంట్స్ ఫ్యామిలీస్ తో మాట్లాడిన నాగార్జున మన టీవీ ద్వారా ఐదుగురు ఫైనలిస్ట్ లతో మాట్లాడారు.
Bigg Boss 3: రాహుల్ తోపు పాట.. చింపేశాడన్న పునర్నవి!
రాహుల్ ఓ పాట పాడాడు. ఆ తరువాత కేథరిన్ త్రెసా తన పెర్ఫార్మన్స్ తో స్టేజ్ ని షేక్ చేసింది. ఇక హౌస్ లో ఉన్న ఐదుగురిలో ముందుగా ఎవరు ఎలిమినేట్ కాబోతున్నారనే చెప్పడానికి డైరెక్టర్ మారుతి, హీరోయిన్ రాశిఖన్నాలను తీసుకొచ్చారు. స్టేజ్ పైకి వచ్చిన మారుతి టాప్ 5 కంటెస్టంట్స్ గురించి మాట్లాడారు.
ఈ క్రమంలో శ్రీముఖిని నోరేసుకొని పడిపోతుందని సరదాగా కామెంట్స్ చేశారు. ఆ తరువాత హౌస్ లోకి వెళ్లిన మారుతి, రాశిఖన్నా హౌస్ మేట్స్ తో కలిసి కాసేపు సరదాగా గడిపారు. ఇప్పటికే రాహుల్ విన్నర్, శ్రీముఖి రన్నరప్ అనే ప్రచారంపై క్లారిటీ రావాలంటే ఈ రోజు షో ముగిసే వరకు వెయిట్ చేయాల్సిందే.