నిఖిల్ 'అర్జున్ సురవరం' రిలీజ్ డేట్ ఫిక్స్!
నిఖిల్ జంటగా లావణ్య త్రిపాఠి నటించింది. పోసాని కృష్ణమురళి, సత్య, తరుణ్ అరోరా ప్రధాన పాత్రల్లో నటించారు. సామ్ సి.ఎస్ సంగీతం అందించిన ఈ చిత్రానికి సూర్య సినిమాటోగ్రఫీ అందించారు.
యంగ్ హీరో నిఖిల్ కథానాయకుడిగా ప్రముఖ నిర్మాత ఠాగూర్ మధు సమర్పణలో మూవీ డైనమిక్స్ ఎల్ ఎల్ పి బ్యానర్పై రాజ్కుమార్ ఆకెళ్ల నిర్మాతగా టి.సంతోష్ దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ 'అర్జున్ సురవరం'. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని పవర్ ఫుల్ కంటెంట్తో రూపొందిన ఈ చిత్రాన్ని నవంబర్ 29న ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. చాలా కాలంగా వాయిదా పడుతూ వస్తోన్న ఈ సినిమా ఫైనల్ గా రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది.
సినిమా టైటిల్ విషయంలో కూడా చాలా వివాదాలను ఎదుర్కోవాల్సి వచ్చింది. మొదట 'ముద్ర' అనే టైటిల్ అనుకోగా.. అదే టైటిల్ తో నట్టికుమార్ సినిమా తీయడం అతడు గొడవకి దిగాడు. దీంతో మరో ఆప్షన్ లేక సినిమా టైటిల్ ని 'అర్జున్ సురవరం'గా మార్చారు.
ఆ తరువాత కొన్ని ఫైనాన్షియల్ సమస్యల కారణంగా సినిమా వాయిదా పడుతూ వస్తోంది. దీంతో జనాలకు కూడా ఈ సినిమా ఆసక్తి సన్నగిల్లుతోంది. ప్రస్తుతానికయితే సినిమాపై ఎలాంటి బజ్ లేదు. కనీసం ప్రమోషన్స్ తో అయినా సినిమాపై పాజిటివ్ బజ్ వస్తుందో చూడాలి.
నిఖిల్ జంటగా లావణ్య త్రిపాఠి నటించింది. పోసాని కృష్ణమురళి, సత్య, తరుణ్ అరోరా ప్రధాన పాత్రల్లో నటించారు. సామ్ సి.ఎస్ సంగీతం అందించిన ఈ చిత్రానికి సూర్య సినిమాటోగ్రఫీ అందించారు. ఈ సినిమా పోస్టర్స్కు, టీజర్కు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది.
నటీనటులు:
నిఖిల్, లావణ్య త్రిపాఠి, వెన్నెలకిషోర్, పోసాని కృష్ణమురళి, తరుణ్ అరోరా, నాగినీడు, సత్య, విద్యుల్లేఖా రామన్ తదితరులు
సాంకేతిక వర్గం:
రచన, దర్శకత్వం: టి.సంతోష్
సమర్పణ: ఠాగూర్ మధు
బ్యానర్: మూవీ డైనమిక్స్ ఎల్ ఎల్ పి
నిర్మాత: రాజ్కుమార్ అకెళ్ల
సంగీతం: సామ్ సి.ఎస్
సినిమాటోగ్రఫీ: సూర్య
ఎడిటర్: నవీన్ నూలి