Asianet News TeluguAsianet News Telugu

అనుష్క తర్వాత అమలాపాల్.. క్రేజీ డైరెక్టర్ కు షాక్!

దిగ్గజ దర్శకుడు మణిరత్నం కలల ప్రాజెక్ట్ పొన్నియన్ సెల్వన్. ఈ స్క్రిప్ట్  స్క్రిప్ట్ పై మణిరత్నం చాలా రోజులుగా కసరత్తు చేస్తున్నారు. ఇండియన్ స్క్రీన్ పై మునుపెన్నడూ లేనివిధంగా ఈ చిత్రాన్ని రూపొందించాలనేది మణిరత్నం కల.

AmalaPaul walks out of Maniratnam's Ponniyin Selvan
Author
Hyderabad, First Published Nov 14, 2019, 7:19 PM IST

పొన్నియన్ సెల్వన్ అనే ప్రసిద్ధ తమిళ నవల ఆధారంగా మణిరత్నం ఈ చిత్రానికి ప్లాన్ చేస్తున్నారు. దీని కోసం ఇండియాలోని ప్రముఖుల నటులందరిని ఏఈ చిత్రంలో భాగం చేయాలని మణిరత్నం భావిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. 

మణిరత్నం నటీనటుల్ని ఎంపిక చేసే పనిలో బిజీగా ఉన్నారు. చియాన్ విక్రమ్, ఐశ్వర్యారాయ్, కీర్తి సురేష్, నయనతార లాంటి నటులంతా ఈ చిత్రంలో నటించబోతున్నట్లు వార్తలు వచ్చాయి. అనుష్క శెట్టి, అమలాపాల్ లని కూడా మణిరత్నం కీలక పాత్రల కోసం ఎంపిక చేసుకున్నారు. 

ఇక ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కడమే మిగిలివుంది అనుకుంటున్న తరుణంలో మణిరత్నం కు వరుస షాక్ లు ఎదురవుతున్నాయి. ఒక్కొక్కరుగా ఈ చిత్రం నుంచి తప్పుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. కొన్ని రోజుల క్రితం అనుష్క ఈ చిత్రం నుంచి తప్పుకుంటున్నట్లు వార్తలు వచ్చాయి. నయనతార రేంజ్ లో తన పాత్ర లేదనే ఉద్దేశంతో అనుష్క తప్పుకున్నట్లు ప్రచారం జరిగింది. 

తాజాగా మరో నటి దర్శకుడికి హ్యాండిచ్చినట్లు తెలుస్తోంది. విభిన్నమైన చిత్రాలతో దూసుకుపోతున్న అమలపాల్ ఈ చిత్రం నుంచి తప్పుకున్నట్లు కోలీవుడ్ లో ప్రచారం జరుగుతోంది. ఈ చిత్ర షూటింగ్ ఆలస్యం కానుండడం వల్లే అమలాపాల్ తప్పుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. భారీ చిత్రాల నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని నిర్మించనుంది.   

Follow Us:
Download App:
  • android
  • ios