'అల.. వైకుంఠపురములో' ఆ పాత్రే హైలెట్!
అల్లు అర్జున్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్నా చిత్రం 'అల.. వైకుంఠపురములో' మరో రెండు ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాపై అభిమానుల్లో అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు.
జులాయి - సన్ ఆఫ్ సత్యమూర్తి వంటి బాక్స్ ఆఫీస్ హిట్స్ అనంతరం అల్లు అర్జున్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్నా చిత్రం 'అల.. వైకుంఠపురములో' మరో రెండు ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాపై అభిమానుల్లో అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. సినిమాలో చాలా మంది స్టార్ యాక్టర్స్ ఉండడంతో ప్రతి సీన్ హైలెట్ గా ఉంటుందని ఇప్పటికే ఓ పాజిటివ్ టాక్ వచ్చింది.
ముఖ్యంగా సీనియర్ యాక్టర్ మురళి శర్మ పాత్ర కూడా సినిమాలో చాలా కీలకమని తెలుస్తోంది. కథానాయకుడి తండ్రి పాత్రలో నటించిన ఈ యాక్టర్ గత సినిమాల్లో కంటే ఈ సినిమాలో డిఫరెంట్ యాక్టింగ్ స్కిల్స్ ని బయటపెట్టారట. ఈ విషయాన్నీ ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో బన్నీ వివరించాడు. 'అల..వైకుంఠపురములో' సినిమాకు మురళి శర్మ గారి పాత్ర ఒక బ్యాక్ బోన్ లాంటిదని అన్నారు.
బన్నీ ఇంత గట్టిగా చెప్పారంటే ఆయన పాత్ర రేంజ్ లో అలరించనుందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఇక సుశాంత్ పాత్ర కూడా కథలో చాలా అల్లు అర్జున్ తెలిపాడు. ఎక్కడా అభిమానులను నీరాశపరచకుండా సినిమా ఆడియెన్స్ కి మంచి కిక్ ఇస్తుందని చిత్ర యూనిట్ చెబుతోంది. మరీ సినిమా ఎంత వరకు క్లిక్ అవుతుందో చూడాలి. పూజా హెగ్డే - నివేత పేతురేజ్ హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమాకు థమన్ సంగీతం అందించారు. గీత ఆర్ట్స్ - హారిక హాసిని బ్యానర్స్ లో చినబాబు - అల్లు అరవింద్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్వహించారు.