Sai Kiran:నిర్మాతలు బెదిరింపు, పోలీసులను ఆశ్రయించిన సాయికిరణ్
ఈ సినిమాలో అనగనగా ఆకాశం ఉంది, ఆకాశంలో మేఘం ఉందిఅనే పాటలో నటించి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నటువంటి హీరో సాయి కిరణ్ తెలియని వారంటూ ఉండరు.
ప్రముఖ నటుడు, గాయకుడు సాయికిరణ్ నిర్మాతలు జాన్ బాబు, లివింగ్ స్టన్ లపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు తన వద్ద రూ.10.6 లక్షలు అప్పుగా తీసుకున్నారని, తిరిగి తీర్చాలని అడిగితే తనపై బెదిరింపులకు పాల్పడుతున్నారని సాయికిరణ్ ఆరోపించారు. సాయికిరణ్ ఫిర్యాదుతో జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
ప్రముఖ దర్శకుడు కె విజయభాస్కర్ దర్శకత్వంలో వచ్చిన సినిమా నువ్వే కావాలి.ఈ సినిమాలో తరుణ్ హీరోగా నటించగా సెకండ్ హీరోగా సాయి కిరణ్ నటించారు. ఈ సినిమా తెలుగు ప్రేక్షకులకు ఇప్పటికీ బాగానే గుర్తుకు ఉండే ఉంటుంది. ఈ సినిమాలో అనగనగా ఆకాశం ఉంది, ఆకాశంలో మేఘం ఉందిఅనే పాటలో నటించి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నటువంటి హీరో సాయి కిరణ్ తెలియని వారంటూ ఉండరు.
ఆ తర్వాత 'ప్రేమించు' చిత్రంతో మరో హిట్ ను ఖాతాలో వేసుకున్నారు. ఇటీవల కాలంలో ఆయన టీవీ సీరియళ్లలో నటిస్తున్నారు. .‘గుప్పెడంత మనసు’ సీరియల్లో హీరోకి తండ్రిగా మహేంద్ర భూషన్ పాత్రలో అదరగొడుతున్నారు. కేవలం తెలుగులోనే కాకుండా మలయాళంలో కూడా వరుస సీరియల్స్ చేస్తూ బిజీ ఆర్టిస్ట్గా మారారు సాయి కిరణ్.
గుప్పెడంత మనసు, కోయిలమ్మ, సుడిగుండాలు, శివలీలలు, సూర్య భగవాన్, అభిలాష వంటి సీరియల్స్తో పాపులర్ అయిన సాయి కిరణ్.. పాతికకి పైగా సినిమాల్లో హీరోగా నటించారు. నువ్వే కావాలి, ప్రేమించు, దేవి, మనసుంటే చాలు వంటి చిత్రాల్లో నటించిన సాయి కిరణ్.. లెజెండరీ సింగర్ పి. సుశీల గారికి సొంత మనువడు.