మాకు చిప్పే గతి.. వైరల్ అవుతున్న బ్రహ్మాజీ పోస్ట్
కరోనా మహమ్మారి ప్రజల ప్రాణాలని హరించడమే కాదు.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థనే చిదిమేస్తోంది. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రపంచ దేశాలు లాక్ డౌన్ విధానాన్ని అమలు చేస్తున్న సంగతి తెలిసిందే.
కరోనా మహమ్మారి ప్రజల ప్రాణాలని హరించడమే కాదు.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థనే చిదిమేస్తోంది. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రపంచ దేశాలు లాక్ డౌన్ విధానాన్ని అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. దీనితో అన్ని రంగాల వ్యాపారాలు దాదాపుగా మూత పడ్డాయి.
చిత్ర పరిశ్రమపై లాక్ డౌన్ తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ప్రస్తుతం ఎటువంటి షూటింగ్స్ జరగడం లేదు. నిర్మాణ దశలో ఉన్న చిత్రాలు ఆగిపోవడం వల్ల నిర్మాతలు ఆర్థికంగా నష్టపోతున్నారు. చిన్నపాటి నటులు, సినీ కార్మికులు ఆదాయం లేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
వీలైనంత త్వరగా లాక్ డౌన్ ఎత్తివేయాలని సినీ కార్మికులు, నిర్మాతలు కోరుకుంటున్నారు. తాజాగా టాలీవుడ్ నటుడు బ్రహ్మాజీ లాక్ డౌన్ పై సోషల్ మీడియాలో సంచలన వ్యాఖ్యలు చేశాడు.
త్వరలో నాల్గవ దశ లాక్ డౌన్ కూడా అమలు కానున్నట్లు తెలుస్తోంది. లాక్ డౌన్ పొడిగిస్తే మా చేతికి చిప్పే అంటూ బ్రహ్మాజీ పెట్టిన పోస్ట్ వైరల్ గా మారింది.