Asianet News TeluguAsianet News Telugu

‘మత్తు వదలరా’ మంచి హిట్.. బడ్జెట్ ఎంతో తెలుసా..?

ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు  ‘మత్తు వదలరా’  సినిమా బడ్జెట్ కేవలం రూ.2.1 కోట్ల అని తెలిసింది.  ఈ బడ్జెట్ లో రెమ్యునేషన్స్ ని మినహాయిస్తే.. మేకింగ్ కోసం పెట్టిన ఖర్చు రూ.1.3 కోట్లు మాత్రమేని చెప్తున్నారు. 

About Keeravani's song Mathu Vadalara movie Budget
Author
Hyderabad, First Published Dec 28, 2019, 4:12 PM IST

చిన్న సినిమాగా వచ్చి పెద్ద హిట్ గా మారుతున్న చిత్రం ‘మత్తు వదలరా’. ఈ సినిమాకు మొదటి రోజే పాజిటివ్ టాక్ రావడం.. బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లను సాధిస్తుండటంతో నిర్మాతలు ఫుల్ ఖుషీగా ఉన్నారు. దాంతో ఈ వీకెండ్‌లో స్క్రీన్లను పెంచాలని నిర్ణయం తీసుకున్నారు నిర్మాతలు. ముఖ్యంగా ‘ఏ’ క్లాస్ ఆడియన్స్ నుంచి కూడా మంచి రెస్పాన్స్ వస్తుండటంతో మల్టీఫ్లెక్స్‌ల్లోనూ షోలను పెంచుతున్నారు. ఈ నేపధ్యంలో  ‘మత్తు వదలరా’ కు ఎంత ఖర్చు పెట్టారనే విషయం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.
 
ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు  ‘మత్తు వదలరా’  సినిమా బడ్జెట్ కేవలం రూ.2.1 కోట్ల అని తెలిసింది.  ఈ బడ్జెట్ లో రెమ్యునేషన్స్ ని మినహాయిస్తే.. మేకింగ్ కోసం పెట్టిన ఖర్చు రూ.1.3 కోట్లు మాత్రమేని చెప్తున్నారు. కానీ ఈ సినిమా చూసిన వాళ్లు అంత తక్కువలో ఈ సినిమా చేసారంటే నమ్మరు. అంతలా తెరమీద మంచి క్వాలిటీ కనిపిస్తుంది. దానికి తోడు ఈ సినిమాలో గ్రాఫిక్స్‌కు కూడా ఉన్నాయి. ఆ బడ్జెట్ కూడా కలిపి 1.3 కోట్లలో సినిమా అయిపోవడం ఆశ్చర్యం కలిగించే విషయమే.  

చిట్టి ఫ్రాక్ లో నభా అందాలు.. ఓ లుక్కేయాల్సిందే!

అందుకు కారణం .. తన డైరెక్షన్ టీం మొత్తాన్ని రితేష్ తీసుకున్న శ్రద్దే అంటున్నారు నిర్మాత. కేవలం 42 రోజుల్లోనే సినిమాను ముగించామని మైత్రీ సంస్థ వెల్లడించింది.  రితేష్ రాణా ‘మత్తు వదల’రాకు దర్శకత్వం వహించాడు.

కామెడీ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం ద్వారా కీరవాణి చిన్న కుమారుడు శ్రీసింహ హీరోగా.. పెద్ద కుమారుడు కాల భైరవ సంగీత దర్శకుడిగా టాలీవుడ్‌కు పరిచయం అయ్యారు. జీవా, విద్యుల్లేఖ రామన్, సత్య, నగరేష్ అగస్త్య, వెన్నెల కిశోర్, బ్రహ్మాజీ తదితరులు కీలక పాత్రలలో కనిపించారు. మైత్రీ మూవీ మేకర్స్, క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు.

Follow Us:
Download App:
  • android
  • ios