Asianet News TeluguAsianet News Telugu

అభిషేక్ ఇంటిని అమ్మేయటానికి కారణం ఇదే!? రేటెంత

 అభిషేక్ బచ్చన్ కి  దీని​ అమ్మకం ద్వారా  రూ. 45.75 కోట్లు వచ్చాయి. మనీ కంట్రోల్‌ నివేదిక ప్రకారం.. ముంబైలోని వర్లి ప్రాంతంలో  ‘ఒబెరాయ్ 360’ అపార్టుమెంట్‌ వెస్ట్ సైడ్ లో ఉన్న 37వ అంతస్తులో 7,527 చదరపు అడుగుల విస్తీర్ణం కలిగి  ఉంది.

Abhishek Bachchan sells luxury Worli flat for Rs 46 crore
Author
Mumbai, First Published Aug 15, 2021, 11:35 AM IST


అభిషేక్ బచ్చన్ తన ఇంటిని అమ్మేయడం బాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఆయన రీసెంట్ గా ముంబైలో తన లగ్జరీ అపార్ట్‌మెంట్‌ను విక్రయించారు. బి టౌన్ మీడియా సమాచారం ప్రకారం అభిషేక్ బచ్చన్ కి  దీని​ అమ్మకం ద్వారా  రూ. 45.75 కోట్లు వచ్చాయి. మనీ కంట్రోల్‌ నివేదిక ప్రకారం.. ముంబైలోని వర్లి ప్రాంతంలో  ‘ఒబెరాయ్ 360’ అపార్టుమెంట్‌ వెస్ట్ సైడ్ లో ఉన్న 37వ అంతస్తులో 7,527 చదరపు అడుగుల విస్తీర్ణం కలిగి  ఉంది. అభిషేక్‌ బచ్చన్‌ ఈ ఇంటిని 2014లో రూ. 41 కోట్లకు కొనుగోలు చేసినట్లు సమాచారం.

ఈ నేపద్యంలో హఠాత్తుగా అభిషేక్ ఎందుకు ఈ అపార్టమెంట్ ని అమ్మేడనేది చర్చనీయాంశమై కూర్చుంది. వాస్తవానికి అభిషేక్, అతని కుటుంబ సభ్యులు ఎవరూ ఈ అపార్ట్‌మెంట్‌లో నివసించంలేదు. నటుడు తన భార్య ఐశ్వర్యరాయ్ బచ్చన్, కుమార్తె ఆరాధ్య బచ్చన్‌తో కలిసి ముంబైలోని బచ్చన్ కుటుంబానికి చెందిన “జల్సా”లో నివసిస్తున్నారు. అభిషేక్ బచ్చన్ ఈ ఇల్లు ‘ఒబెరాయ్ 360’లో 37వ అంతస్తులో ఉండటంతో అక్కడికి తమ ఫ్యామిలి ఇప్పట్లే వెళ్లే ఆలోచన లేదని ఈ నిర్ణయానికి వచ్చాడంటున్నారు. అలాగే ఈ సొమ్ము వేరే చోట ఇన్వెస్ట్ చేస్తున్నారని అందుకే హటాత్తుగా ఇలా అమ్మకానికి పెట్టాడంటున్నారు.

మరో  విషయం ఏమిటంటే అక్షయ్ కుమార్, షాహిద్ కపూర్‌లకు కూడా ఈ భవనంలో అపార్ట్‌మెంట్‌లు ఉన్నాయి. షాహిద్ తన అపార్ట్‌మెంట్ కోసం రూ. 56 కోట్లు చెల్లించగా, అక్షయ్ రూ.52.5 కోట్లు పెట్టి కొనుగోలు చేశారు. అంతే కాకుండా రాణి ముఖర్జీ, దిశా పటానీ ఖార్ వెస్ట్ పరిసరాల్లో సముద్ర ముఖంగా ఉన్న గృహాలను కొనుగోలు చేశారు. రాణి ముఖర్జీ దీనికోసం రూ.7.12 కోట్లు ఖర్చు చేయగా.. దిశా పటానీ రూ.5.95 కోట్లకు కొనుగోలు చేసింది. ఈ ఏడాది మేలో అమితాబ్ బచ్చన్ డూప్లెక్స్ అపార్ట్‌మెంట్ కొనుగోలు చేశారు. అంధేరిలో కొనుగోలు చేసిన ఈ ఇంటి విలువ 31 కోట్లు అని వార్తలు విన్పించాయి.  
 
అభిషేక్ చివరిసారిగా ది బిగ్ బుల్‌లో కనిపించాడు. ఇది వివాదాస్పద స్టాక్ బ్రోకర్ హర్షద్ మెహతా జీవితం ఆధారంగా తెరకెక్కిన సినిమా. అయితే ఈ సినిమా హన్సల్ మెహతా హిట్ సిరీస్‌తో పోల్చితే బాగా ఆడలేదనే చెప్పాలి. ఆయన తదుపరి రెండు చిత్రాలు నిమ్రత్ కౌర్‌తో దాస్వి, చిత్రాంగద సేన్‌తో బాబ్ బిశ్వాస్ సిమాలు విడుదల కావాల్సి ఉంది. అంతేకాకుండా ఐశ్వర్య చివరిసారిగా అనిల్ కపూర్, రాజ్‌కుమార్ రావుతో కలిసి ఫన్నీ ఖాన్‌ సినిమాలో కనిపించింది. ఆమె తదుపరి ప్రాజెక్ట్ మణిరత్నం పొన్నియిన్ సెల్వన్ సినిమాలో కనిపించనుంది. ఈ చిత్రం కల్కి కృష్ణమూర్తి తమిళ నవల ఆధారంగా తెరకెక్కనున్న పీరియడ్ ఇతిహాసం.   
 

Follow Us:
Download App:
  • android
  • ios