Asianet News TeluguAsianet News Telugu

ప్రేమ పేరుతో బాలికను ట్రాప్ చేసిన పూజారి: అత్యాచారం, బ్లాక్‌మెయిల్

సిద్ధిపేటలో దారుణం జరిగింది. మైనర్ బాలికపై పూజారి అత్యాచారానికి పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళితే.. పట్టణంలోని ఓ దేవాలయంలో అర్చకుడిగా విధులు నిర్వహిస్తున్న మహేందర్ అనే వ్యక్తి... స్థానిక పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న బాలికతో ఏడాదిగా ప్రేమాయణం నడుపుతున్నాడు

Preist molested minor girl in siddipet
Author
Siddipet, First Published Dec 27, 2019, 3:38 PM IST

సిద్ధిపేటలో దారుణం జరిగింది. మైనర్ బాలికపై పూజారి అత్యాచారానికి పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళితే.. పట్టణంలోని ఓ దేవాలయంలో అర్చకుడిగా విధులు నిర్వహిస్తున్న మహేందర్ అనే వ్యక్తి... స్థానిక పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న బాలికతో ఏడాదిగా ప్రేమాయణం నడుపుతున్నాడు.

పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఆమెను లొంగదీసుకున్నాడు. అక్కడితో ఆగకుండా ఇద్దరు సన్నిహితంగా ఉన్న ఫోటోలను లోకల్ వాట్సాప్‌ గ్రూపుల్లో వైరల్ చేశాడు. దీంతో ఈ విషయం పట్టణంలో దావానంలా వ్యాపించింది.

Also Read:ప్రేమ పేరిట వల.. బాలికపై యువకుడు అత్యాచారం

ఆ నోటా ఈ నోటా విషయం తెలుసుకున్న బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన మిరుదొడ్డి పోలీసులు పూజారిని అదుపులోకి తీసుకుని పోక్సో చట్టంతో పాటు మరికొన్ని సెక్షన్ల కింద కేసు నమోదు చేసి బాలికను వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తరలించారు.

కాగా.. మరో ఘటనలో కాప్రాకు చెందిన శ్రీధర్ గౌడ్ కుమారుడు ప్రణయ్(21) డిప్లమా పూర్తి చేసి ఇంటి వద్దే ఖాళీగా ఉంటున్నాడు. అతని ఇంటికి సమీపంలో ఉన్న అమ్మమ్మ ఇంటికి 17ఏళ్ల బాలిక గత మే నెల వేసవి సెలవులకు వచ్చింది. అప్పుడు బాలికకు ప్రణయ్ తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయాన్ని ఆసరాగా చేసుకున్న యువకుడు.. ప్రేమ పేరిట బాలికకు మరింత దగ్గరయ్యాడు.

అతని మాయమాటలను బాలిక పూర్తిగా నమ్మేసింది. దీంతో... అదే అదనుగా చేసుకొని బాలికపై యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయం ఎవరికీ చెప్పవద్దని ఆమెకు చెప్పాడు. బాలిక ఫోన్ నెంబర్ కూడా తీసుకున్నాడు. బాలిక సెలవలు అనంతరం తమ గ్రామానికి వెళ్లిపోగా... అక్కడకు వెళ్లి కూడా ఆమెపై రెండు సార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. 

Also Read:నాపై తప్పుడు కేసు పెట్టారు: హాజీపూర్ నిందితుడు శ్రీనివాస్ రెడ్డి

కాగా.... ఇటీవల రెండు రోజుల క్రితం ప్రణయ్.. బాలికకు ఫోన్ చేసి అసభ్యకరంగా మాట్లాడటం మొదలుపెట్టాడు. దీనిని బాలిక తల్లిదండ్రులు గుర్తించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. బాలికను మందలించడంతో జరిగిన విషయం చెప్పింది. దీంతో తల్లిదండ్రులు పేట్‌బషీరాబాద్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తు న్నట్లు పోలీసులు తెలిపారు.

Follow Us:
Download App:
  • android
  • ios