రాజు చౌక్ నుంచి గాంధీ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. గాంధీ ప్లకార్డులను ప్రదర్శించారు. గాంధీ సూక్తులను ప్రదర్శించారు. అనంతరం గాందీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
జాతిపిత మహాత్మాగాంధీ 150వ జయంతి వేడుకులను దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్నారు. కరీంనగర్ జిల్లాలో కాంగ్రెస్ నేతలు వినూత్నంగా గాంధీ జయంతి వేడుకలు నిర్వహించారు. కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో నగరంలో ర్యాలీ నిర్వహించారు.
150వ జయంతి కనుక 150మీటర్ల పొడవుగల జాతీయ పతకాన్ని తయారు చేసి... ఊరేగించారు. రాజు చౌక్ నుంచి గాంధీ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. గాంధీ ప్లకార్డులను ప్రదర్శించారు. గాంధీ సూక్తులను ప్రదర్శించారు. అనంతరం గాందీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లాకు చెందిన పలువురు సీనియర్ నేతలు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. 150మీటర్ల జాతీయ పతాకాన్ని ప్రదర్శించడం అందరినీ ఆకట్టుకుంది.
Read Exclusive COVID-19 Coronavirus News updates, from Telangana, India and World at Asianet News Telugu.
వర్చువల్ బోట్ రేసింగ్ గేమ్ ఆడండి మిమ్మల్ని మీరు ఛాలెంజ్ చేసుకోండి ఇప్పుడే ఆడటానికి క్లిక్ చేయండి
Last Updated Oct 2, 2019, 11:56 AM IST